ETV Bharat / state

అర్హులందరికీ డబుల్ బెడ్​రూం ఇళ్లివ్వాలి: సీపీఎం

సికింద్రాబాద్, అడ్డగుట్టలోని మరేడిపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా నిర్వహించింది. అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూంలు కేటాయించాలని డిమాండ్ చేసింది.

author img

By

Published : Feb 6, 2021, 12:40 PM IST

Breaking News

ఆన్‌లైన్‌లో రెండుపడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి వెంటనే డబుల్‌ బెడ్‌రూమ్​లు ఇవ్వాలని కోరుతు సీపీఎం సికింద్రాబాద్‌ కార్యదర్శి అజయ్‌ బాబు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో అడ్డగుట్టలోని మరేడిపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఈ నిరసన జరిగింది. ఈ నిరసనలో ఆన్ లైన్‌ దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి డబుల్‌ బెడ్‌రూమ్​లు కేటాయించాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరారు.

ఫ్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రెవెన్యూ పరిధిలో చాల మంది .. అద్దె గృహాలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్తగా ఎవరైతే ఇండ్లు లేని వారు ఉన్నారో వెంటనే వారి వివరాలను తమకు సమర్పించాలని ఎమ్మార్వో సునీల్ సూచించారు. అజయ్‌బాబును తుకారాంగేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్‌కు తరలించారు.

ఆన్‌లైన్‌లో రెండుపడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి వెంటనే డబుల్‌ బెడ్‌రూమ్​లు ఇవ్వాలని కోరుతు సీపీఎం సికింద్రాబాద్‌ కార్యదర్శి అజయ్‌ బాబు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో అడ్డగుట్టలోని మరేడిపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఈ నిరసన జరిగింది. ఈ నిరసనలో ఆన్ లైన్‌ దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి డబుల్‌ బెడ్‌రూమ్​లు కేటాయించాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరారు.

ఫ్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రెవెన్యూ పరిధిలో చాల మంది .. అద్దె గృహాలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్తగా ఎవరైతే ఇండ్లు లేని వారు ఉన్నారో వెంటనే వారి వివరాలను తమకు సమర్పించాలని ఎమ్మార్వో సునీల్ సూచించారు. అజయ్‌బాబును తుకారాంగేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి: చక్కా జామ్​: భద్రతా వలయంలో దేశ రాజధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.