ETV Bharat / state

నల్లా కనెక్షన్​కు ఆధార్​ అనుసంధానానికి గడువు పెంపు

author img

By

Published : Mar 26, 2021, 3:01 AM IST

హైదరాబాద్​లోని డొమెస్టిక్ వినియోగ‌దారులు మీ-సేవ కేంద్రాల్లో లేదా జ‌ల‌మండ‌లి వెబ్​సైట్​లో లాగిన్ అవ్వడంద్వారా నల్లా కనెక్షన్​కు​ ఆధార్​ను అనుసంధానం చేసుకోవచ్చని రాష్ట్ర జలమండలి ఎండీ ఎం.దానకిశోర్​ తెలిపారు. ఖైర‌తాబాద్​లోని జ‌ల‌మండలి ప్రధాన కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన ఆయన నెలకు ఇరవై వేల లీటర్ల ఉచిత తాగు నీటి పథకం అమలు, పురోగతిపై చర్చించారు.

Telangana Water Board MD Review
తెలంగాణ రాష్ట్ర జల మండలి సమావేశం

హైదరాబాద్​ మహా న‌గ‌రంలో ఉచిత తాగునీటి ప‌థ‌కానికి అర్హులైన వారికి నీటి మీట‌ర్లను ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్​ తెలిపారు. ఖైర‌తాబాద్​లోని జ‌ల‌మండలి ప్రధాన కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన ఆయన నెలకు ఇరవై వేల లీటర్ల ఉచిత తాగు నీటి పథకం అమలు, పురోగతిపై చర్చించారు. నల్లా కనెక్షన్​కు ఆధార్​ను అనుసంధానించేందుకు గడువును పురపాలక శాఖ మంత్రి ఏప్రిల్​ 30 వరకు పెంచినట్లు అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు.

నగరంలోని డొమెస్టిక్ వినియోగ‌దారులు మీ-సేవ కేంద్రాల్లో, జ‌ల‌మండ‌లి వెబ్​సైట్​లో లాగిన్ అవ్వడం ద్వారా ఆధార్​ను అనుసంధానం చేసుకోవచ్చని ఎం. కిశోర్​ తెలిపారు. ఈ ప్రక్రియ‌ను పూర్తి చేయ‌డానికి ప్రతీ సెక్షన్​కు ఒక ఆధార్ బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సౌల‌భ్యం మ‌రిన్ని రోజులు కొన‌సాగుతుంద‌న్నారు. డొమెస్టిక్ కేట‌గిరిలో మీట‌ర్ లేని వినియోగ‌దారుల‌ను గుర్తించి కొత్త మీట‌ర్లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు.‌ ఇప్పటివరకు డొమెస్టిక్ స్లమ్​లలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ 50 శాతం పూర్తయిందన్నారు.

డొమెస్టిక్ స్లమ్​​ కేటగిరీలో నగరంలో మొత్తం 2,00,785 కనెక్షన్లు ఉండగా 1,05,892 కనెక్షన్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయినట్లు కిశోర్​ తెలిపారు. డొమెస్టిక్ కేటగిరిలో మొత్తం 7,64,568 కనెక్షన్లు ఉండగా.. 1,52,588 కనెక్షన్లకు ఆధార్ లింక్ పూర్తయిందని అన్నారు. అపార్ట్​మెంట్​లు, కాలనీల్లో కొత్త మీటర్ల ఏర్పాటు, ఆధార్ అనుసంధాన ప్రక్రియపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి జ‌ల‌మండ‌లి మేనేజ‌ర్లు, మీట‌ర్ రీడ‌ర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జీఎమ్​లను ఆదేశించారు.

ఇదీ చదవండి: ఘనంగా సురవరం సుధాకర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్​ మహా న‌గ‌రంలో ఉచిత తాగునీటి ప‌థ‌కానికి అర్హులైన వారికి నీటి మీట‌ర్లను ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్​ తెలిపారు. ఖైర‌తాబాద్​లోని జ‌ల‌మండలి ప్రధాన కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన ఆయన నెలకు ఇరవై వేల లీటర్ల ఉచిత తాగు నీటి పథకం అమలు, పురోగతిపై చర్చించారు. నల్లా కనెక్షన్​కు ఆధార్​ను అనుసంధానించేందుకు గడువును పురపాలక శాఖ మంత్రి ఏప్రిల్​ 30 వరకు పెంచినట్లు అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు.

నగరంలోని డొమెస్టిక్ వినియోగ‌దారులు మీ-సేవ కేంద్రాల్లో, జ‌ల‌మండ‌లి వెబ్​సైట్​లో లాగిన్ అవ్వడం ద్వారా ఆధార్​ను అనుసంధానం చేసుకోవచ్చని ఎం. కిశోర్​ తెలిపారు. ఈ ప్రక్రియ‌ను పూర్తి చేయ‌డానికి ప్రతీ సెక్షన్​కు ఒక ఆధార్ బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సౌల‌భ్యం మ‌రిన్ని రోజులు కొన‌సాగుతుంద‌న్నారు. డొమెస్టిక్ కేట‌గిరిలో మీట‌ర్ లేని వినియోగ‌దారుల‌ను గుర్తించి కొత్త మీట‌ర్లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు.‌ ఇప్పటివరకు డొమెస్టిక్ స్లమ్​లలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ 50 శాతం పూర్తయిందన్నారు.

డొమెస్టిక్ స్లమ్​​ కేటగిరీలో నగరంలో మొత్తం 2,00,785 కనెక్షన్లు ఉండగా 1,05,892 కనెక్షన్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయినట్లు కిశోర్​ తెలిపారు. డొమెస్టిక్ కేటగిరిలో మొత్తం 7,64,568 కనెక్షన్లు ఉండగా.. 1,52,588 కనెక్షన్లకు ఆధార్ లింక్ పూర్తయిందని అన్నారు. అపార్ట్​మెంట్​లు, కాలనీల్లో కొత్త మీటర్ల ఏర్పాటు, ఆధార్ అనుసంధాన ప్రక్రియపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి జ‌ల‌మండ‌లి మేనేజ‌ర్లు, మీట‌ర్ రీడ‌ర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జీఎమ్​లను ఆదేశించారు.

ఇదీ చదవండి: ఘనంగా సురవరం సుధాకర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.