రాష్ట్ర మహిళా కమిషన్కు ఛైర్పర్సన్ నియమించడం లేదన్న పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. రెండేళ్లుగా ఛైర్పర్సన్ లేరన్న రేగులపాటి రమ్యారావు లేఖపై చర్చించి... చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్పర్సన్లను నియమించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నియామకానికి ఏం చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. వివరాలు సమర్పించేందుకు... 4 వారాల గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. ఎంతకాలంలో నియమిస్తారో వారం రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వానికి... హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాది వసుధ నాగరాజ్ను అమికస్ క్యూరీగా నియమించింది.
ఇదీ చూడండి: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై హైకోర్టు కీలక నిర్ణయం..