రాష్ట్రంలో ఐదు రోజుల వ్యవధిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకి రూ.591.18 కోట్ల ఆదాయం సమకూరింది. 3 నెలల విరామం తర్వాత ఈ నెల 21 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. కార్డు ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి.
ఆ భయంతో కొంత..
గత సోమవారం నుంచి శనివారం వరకు... 19 వేల 620 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాటి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.213.65 కోట్లు..., స్టాంపు విక్రయాల ద్వారా మరో రూ.377.53 కోట్లు వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో.. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. తద్వారా ప్రభుత్వానికి.... 3 వేల 773 కోట్లు రూపాయల ఆదాయం వచ్చింది. రోజుకు సగటున వంద కోట్లుకుపైగా రిజిస్ట్రేషన్ శాఖకు రాబడి వస్తోంది. మళ్లీ పాతపద్ధతి ఎక్కడ నిలిచిపోతుందనే అనుమానాలతో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు తొందరపడుతున్న అధికారులు అంచనావేస్తున్నారు.
ఇదీ చూడండి: విద్యారంగంపై మహమ్మారి మాయజాలం.. మధ్యలో ఆగిన చదువులు