ETV Bharat / state

వేతన బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

author img

By

Published : Sep 30, 2020, 6:15 PM IST

Updated : Sep 30, 2020, 7:10 PM IST

telangana Government on payment deduction
వేతన బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

18:12 September 30

వేతన బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

కరోనా, లాక్​డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని నాలుగు నెలల్లో చెల్లించనున్నారు. పింఛనుదారులకు మాత్రం రెండు మాసాల్లోనే జమచేయనున్నారు. ఈ మేరకు బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  

కొవిడ్ కారణంగా లాక్​డౌన్ విధించడం వల్ల ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది.. వేతనాలు, పింఛనుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేతనాలు, పింఛను చెల్లింపుల్లో కోత పెట్టింది. ఆ తర్వాత నుంచి పూర్తి వేతనాలు ఇస్తున్నారు.  

బకాయిల చెల్లింపునకు సంబంధించి స్పష్టతనిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పింఛన్​లో కోత విధించిన మొత్తాన్ని అక్టోబర్, నవంబర్ నెలల్లో చెల్లించనున్నట్లు తెలిపింది. 

అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్​తోపాటు వచ్చే ఏడాది జనవరి నెలల్లో బకాయిలను చెల్లించనున్నారు.  

ప్రభుత్వ రంగ, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, గౌరవవేతనాలనూ ఇదే తరహాలో చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.  

ఇవీచూడండి: ఆ సంస్థ ఉద్యోగులకు 6 నెలలు జీతాల్లో కోత

18:12 September 30

వేతన బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

కరోనా, లాక్​డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని నాలుగు నెలల్లో చెల్లించనున్నారు. పింఛనుదారులకు మాత్రం రెండు మాసాల్లోనే జమచేయనున్నారు. ఈ మేరకు బకాయిల చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  

కొవిడ్ కారణంగా లాక్​డౌన్ విధించడం వల్ల ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది.. వేతనాలు, పింఛనుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేతనాలు, పింఛను చెల్లింపుల్లో కోత పెట్టింది. ఆ తర్వాత నుంచి పూర్తి వేతనాలు ఇస్తున్నారు.  

బకాయిల చెల్లింపునకు సంబంధించి స్పష్టతనిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పింఛన్​లో కోత విధించిన మొత్తాన్ని అక్టోబర్, నవంబర్ నెలల్లో చెల్లించనున్నట్లు తెలిపింది. 

అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్​తోపాటు వచ్చే ఏడాది జనవరి నెలల్లో బకాయిలను చెల్లించనున్నారు.  

ప్రభుత్వ రంగ, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, గౌరవవేతనాలనూ ఇదే తరహాలో చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.  

ఇవీచూడండి: ఆ సంస్థ ఉద్యోగులకు 6 నెలలు జీతాల్లో కోత

Last Updated : Sep 30, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.