ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆదర్శ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. "నేను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాట్లాడుతున్నా".. అన్న మాట వినగానే... ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుకు శనివారం ఉదయం 9.30 గంటలకు సీఎం కేసీఆర్... ఫోన్ చేసి మాట్లాడారు.
సీడ్రిల్ ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై.. రైతు ప్రసాదరావును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాను 35 ఎకరాల్లో సీడ్రిల్ను ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశానని... 40-45 బస్తాలు దిగుబడి సాధించానని ప్రసాదరావు సవివరంగా తెలిపారు. త్వరలో కారు పంపిస్తానని... తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని ముఖ్యమంత్రి ప్రసాదరావును కోరారు. ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ఆహ్వానించారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చిన విషయం తెలిసి... ప్రసాదరావును స్థానిక రైతులు అభినందించారు. రైతులు, వ్యవసాయం పట్ల కేసీఆర్కు ఉన్న మక్కువను కొనియాడారు.