ETV Bharat / state

'మా బుక్స్​ను టీచర్లు తాకేవారు కాదు'

author img

By

Published : Apr 14, 2020, 6:30 AM IST

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేడ్కర్‌... తన బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పాఠశాలలో దాహం వేసినా కనీసం నీటి కుండను తాకనిచ్చేవారు కాదట. అలాంటి దీనావస్థను దాటి ఉన్నత శిఖరాలకు చేరారు అంబేడ్కర్. నేడు ఆయన జయంతి సందర్భంగా ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

teachers-cant-touch-our-books-ambedkar
మా బుక్స్​ను టీచర్లు తాకేవారు కాదు...!

'పాఠశాలలో అందరితో పాటు మమ్మల్ని కూర్చోనిచ్చేవాళ్లు కాదు. టీచర్లు మా పాఠ్యపుస్తకాలను తాకేవారు కాదు. దాహం వేస్తే మేము నీటి కుండను తాకకూడదు. పాఠశాల ప్యూన్‌ నీటికుండను పైకెత్తి నీళ్లు పోసేవారు. ప్యూను రాకపోతే మాకు కనీసం నీళ్లు ఇచ్చేవాళ్లు లేరు. ఆ రోజంతా దాహంతో ఉండిపోయేవాళ్లం' రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బాల్యంలో పడిన దీనావస్థ ఇది. అదే పాఠశాలలో ఆయన తన సోదరుడితో కలిసి విద్యనభ్యసించారు. తరగతి గదిలో కూర్చునేందుకు ఎలాంటి సౌకర్యాలను వారికి కల్పించలేదు. దీనివల్ల వారే ఇంటి నుంచి ఒక గోనె సంచిని తీసుకువెళ్లి దానిపైనే కూర్చుని చదువుకున్నారు.
సవాళ్లను అధిగమించి..
ఇలాంటి అవమానాలను ఎన్నో ఎదుర్కొన్న ఆయన వాటిని సవాళ్లుగా స్వీకరించారు. విద్యావేత్తగా ఎదిగారు. అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేశారు. భారతీయ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కుల నిర్మూలనపై అనేక వ్యాసాలు రాశారు, పోరాటాలు చేశారు. కుల నిర్మూలనతోనే రాజకీయ సమానత్వం వస్తుందని ఆయన పిలుపునిచ్చేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని మదించి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రచించారు. అంబేడ్కర్‌ గొప్ప సాహితీవేత్త ఆయనలాగా మరెవరూ అన్ని గ్రంథాలను చదివి ఉండకపోవచ్చు. మారుమూల ప్రాంతంలో పుట్టి విజ్ఞాన శిఖరంగా ఎదిగిన మహనీయుని జయంతి నేడు.

'పాఠశాలలో అందరితో పాటు మమ్మల్ని కూర్చోనిచ్చేవాళ్లు కాదు. టీచర్లు మా పాఠ్యపుస్తకాలను తాకేవారు కాదు. దాహం వేస్తే మేము నీటి కుండను తాకకూడదు. పాఠశాల ప్యూన్‌ నీటికుండను పైకెత్తి నీళ్లు పోసేవారు. ప్యూను రాకపోతే మాకు కనీసం నీళ్లు ఇచ్చేవాళ్లు లేరు. ఆ రోజంతా దాహంతో ఉండిపోయేవాళ్లం' రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బాల్యంలో పడిన దీనావస్థ ఇది. అదే పాఠశాలలో ఆయన తన సోదరుడితో కలిసి విద్యనభ్యసించారు. తరగతి గదిలో కూర్చునేందుకు ఎలాంటి సౌకర్యాలను వారికి కల్పించలేదు. దీనివల్ల వారే ఇంటి నుంచి ఒక గోనె సంచిని తీసుకువెళ్లి దానిపైనే కూర్చుని చదువుకున్నారు.
సవాళ్లను అధిగమించి..
ఇలాంటి అవమానాలను ఎన్నో ఎదుర్కొన్న ఆయన వాటిని సవాళ్లుగా స్వీకరించారు. విద్యావేత్తగా ఎదిగారు. అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేశారు. భారతీయ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కుల నిర్మూలనపై అనేక వ్యాసాలు రాశారు, పోరాటాలు చేశారు. కుల నిర్మూలనతోనే రాజకీయ సమానత్వం వస్తుందని ఆయన పిలుపునిచ్చేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానాన్ని మదించి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రచించారు. అంబేడ్కర్‌ గొప్ప సాహితీవేత్త ఆయనలాగా మరెవరూ అన్ని గ్రంథాలను చదివి ఉండకపోవచ్చు. మారుమూల ప్రాంతంలో పుట్టి విజ్ఞాన శిఖరంగా ఎదిగిన మహనీయుని జయంతి నేడు.

ఇదీ చదవండి: 'సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత అంబేడ్కర్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.