ETV Bharat / state

శ్రీగంధం రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: సీఎస్​ - సోమేశ్​ కుమార్​ను కలిసిన శ్రీగంధం రైతులు

రాష్ట్రంలో శ్రీగంధం సాగుకు అవసరమైన సహకారం అందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ హామీ ఇచ్చారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులు హైదరాబాద్​లోని సచివాలయంలో సీఎస్​ను కలిశారు. శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

sri gandham farmers meet cs somesh kumar  in secretariat in Hyderabad today
శ్రీగంధం రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: సీఎస్​
author img

By

Published : Mar 1, 2021, 10:46 PM IST

శ్రీగంధం సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ హామీ ఇచ్చారు. హైదరాబాద్​లోని సచివాలయంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు సీఎస్​ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని.. కలప ఉత్పత్తుల అమ్మకాలకు లైసెన్సులు, డీలర్​షిప్ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చందనం స్మగ్లర్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. రైతులు శ్రీగంధం సాగు చేయడాన్ని సీఎస్ అభినందించారు. 15 ఏళ్ల వ్యవధిలో రూ.36 లక్షల లాభాన్ని పొందినట్లు రైతులు సోమేశ్​ కుమార్​కు వివరించారు.

ఇదీ చూడండి : ప్రతీ సాక్ష్యం కీలకమే.. వాటిని భద్రపరచండి: హైకోర్టు

శ్రీగంధం సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ హామీ ఇచ్చారు. హైదరాబాద్​లోని సచివాలయంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు సీఎస్​ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని.. కలప ఉత్పత్తుల అమ్మకాలకు లైసెన్సులు, డీలర్​షిప్ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చందనం స్మగ్లర్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. రైతులు శ్రీగంధం సాగు చేయడాన్ని సీఎస్ అభినందించారు. 15 ఏళ్ల వ్యవధిలో రూ.36 లక్షల లాభాన్ని పొందినట్లు రైతులు సోమేశ్​ కుమార్​కు వివరించారు.

ఇదీ చూడండి : ప్రతీ సాక్ష్యం కీలకమే.. వాటిని భద్రపరచండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.