ETV Bharat / state

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. బ్రహ్మోత్సవాల రోజులకు సంబంధించిన ప్రత్యేక కోటాను ప్రకటించింది. రోజుకు 16 వేల టిక్కెట్లను 15 స్లాట్‌లలో అందుబాటులో ఉంచింది. ఈ నెల 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

author img

By

Published : Oct 9, 2020, 5:11 PM IST

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వాహన సేవలను తిరువీధుల్లో నిర్వహించి.. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది.

ఉత్సవాలు జరిగే రోజులకు సంబంధించి ప్రత్యేక కోటాను విడుదల చేశారు. రోజుకు 16 వేల టిక్కెట్లను 15 స్లాట్‌లలో అందుబాటులో ఉంచింది. టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి తనిఖీ కేంద్రంలో పరిశీలించి కొండపైకి అనుమతిస్తారు. శ్రీవారి మూలమూర్తి దర్శనంతో పాటు.. తిరుమాఢ వీధుల్లో నిర్వహించే వాహన సేవలలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వాహన సేవలను తిరువీధుల్లో నిర్వహించి.. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది.

ఉత్సవాలు జరిగే రోజులకు సంబంధించి ప్రత్యేక కోటాను విడుదల చేశారు. రోజుకు 16 వేల టిక్కెట్లను 15 స్లాట్‌లలో అందుబాటులో ఉంచింది. టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి తనిఖీ కేంద్రంలో పరిశీలించి కొండపైకి అనుమతిస్తారు. శ్రీవారి మూలమూర్తి దర్శనంతో పాటు.. తిరుమాఢ వీధుల్లో నిర్వహించే వాహన సేవలలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

ఇదీ చదవండి: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.