ETV Bharat / state

తెరాస ఓటు రాజకీయాలు చేస్తోంది: పొంగులేటి - PONGULETI SUDHAKAR REDDY FIRES ON TRS GOVERNMENT

సబ్​కా సాత్​... సబ్​కా వికాస్​... సబ్​కా విశ్వాసం నినాదంతో ముందుకెళ్తున్న భాజపావైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని పార్టీ నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి తెలిపారు. తెరాస ప్రభుత్వం ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి ఓట్లేపించుకుని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

PONGULETI SUDHAKAR REDDY FIRES ON TRS GOVERNMENT
author img

By

Published : Jul 10, 2019, 8:42 PM IST

తెరాస ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా... రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు పథకం పేరు చెప్పి హడావుడి చేసిన కేసీఆర్‌ సర్కార్‌ ఇప్పుడు ఆ నిధులు కూడా ఇవ్వటంలేదని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి పేరు వస్తుందనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడంలేదని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొంగులేటి డిమాండ్‌ చేశారు.

'తెరాస ఓటు రాజకీయాలు చేస్తోంది'

ఇవీ చూడండి: కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు

తెరాస ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా... రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు పథకం పేరు చెప్పి హడావుడి చేసిన కేసీఆర్‌ సర్కార్‌ ఇప్పుడు ఆ నిధులు కూడా ఇవ్వటంలేదని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి పేరు వస్తుందనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడంలేదని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొంగులేటి డిమాండ్‌ చేశారు.

'తెరాస ఓటు రాజకీయాలు చేస్తోంది'

ఇవీ చూడండి: కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.