ETV Bharat / state

Jagga Reddy Fire On Bjp: 'కాంగ్రెస్​ను దెబ్బ తీసేందుకు భాజపా కుట్ర'

Jagga Reddy Fire On Bjp: భాజపా తీరుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కొత్త వాటిని సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 317 జీవోపై చిచ్చుకు కారణం భాజపాయేనని ధ్వజమెత్తారు.

author img

By

Published : Jan 10, 2022, 11:45 PM IST

Jagga Reddy fire On Bjp
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి

Jagga Reddy Fire On Bjp: ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన భాజపా కొత్త సమస్యలను సృష్టిస్తోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో భాజపా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణలో విచిత్రమైన ఉద్యమాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 317 జీవోపై రగడకు మూలకారణం భాజపాయేనని జగ్గారెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు భాజపా యత్నిస్తోందని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు దగ్గర నుంచి రైతు చట్టాల వరకు అన్ని సమస్యలను సృష్టించింది భాజపానేనని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్ధులకు నిధులు సమకూర్చేందుకు గుత్తేదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించేలా ప్రణాళిక సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ రాస్తానని జగ్గారెడ్డి వివరించారు.

తెలంగాణలో భాజపా అభ్యర్థులకు డబ్బులు సమకూర్చేందుకు యత్నిస్తోంది. మేఘా కృష్ణారెడ్డి లాంటి గుత్తేదారుల హస్తం ఉంది. కేంద్రంలో ఉన్న ఆదేశాలతో భాజపా ఈ కుట్ర చేస్తోంది. దీనిపై నేను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ రాయబోతున్నా. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎన్నికల నియమావళి పాటిస్తుంది. భాజపా కుట్రలు, కుతంత్రాలు, మత రాజకీయాలు చేస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తున్నారు. ఇంధన ధరలు పెంచింది భాజపా కాదా? తెలంగాణలో కూడా హిందూ భావజాలంతో రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్​ను ఇరుకున పెట్టడమే.

-జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్

Jagga Reddy Fire On Bjp: ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన భాజపా కొత్త సమస్యలను సృష్టిస్తోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో భాజపా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణలో విచిత్రమైన ఉద్యమాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 317 జీవోపై రగడకు మూలకారణం భాజపాయేనని జగ్గారెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు భాజపా యత్నిస్తోందని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు దగ్గర నుంచి రైతు చట్టాల వరకు అన్ని సమస్యలను సృష్టించింది భాజపానేనని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్ధులకు నిధులు సమకూర్చేందుకు గుత్తేదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించేలా ప్రణాళిక సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ రాస్తానని జగ్గారెడ్డి వివరించారు.

తెలంగాణలో భాజపా అభ్యర్థులకు డబ్బులు సమకూర్చేందుకు యత్నిస్తోంది. మేఘా కృష్ణారెడ్డి లాంటి గుత్తేదారుల హస్తం ఉంది. కేంద్రంలో ఉన్న ఆదేశాలతో భాజపా ఈ కుట్ర చేస్తోంది. దీనిపై నేను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ రాయబోతున్నా. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎన్నికల నియమావళి పాటిస్తుంది. భాజపా కుట్రలు, కుతంత్రాలు, మత రాజకీయాలు చేస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తున్నారు. ఇంధన ధరలు పెంచింది భాజపా కాదా? తెలంగాణలో కూడా హిందూ భావజాలంతో రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్​ను ఇరుకున పెట్టడమే.

-జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.