తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో చెట్లపై అన్యమత చిహ్నాలు కలకలం రేపాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్లపై అన్యమత చిహ్నాలను పెయింట్తో వేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు.
స్పందించిన భద్రతాధికారి
చెట్లపై అన్యమత చిహ్నాలపై స్విమ్స్ ముఖ్య భద్రత పర్యవేక్షణాధికారి ఎలాంగో రెడ్డి స్పందించారు. డిసెంబర్ 31న రాత్రి ఘటన జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే చెట్లపై చిహ్నాలను తొలగించినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని.. ఆ రోజు సిబ్బంది తక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై అలిపిరి పోలీసులకు సమాచారమిచ్చామన్న ఆయన.. అంతర్గత విచారణ చేపట్టినట్లు వివరించారు.
ఇదీ చూడండి: అనంతగిరి ఘటనపై స్పందించిన డీజీపీ మహేందర్రెడ్డి...