ఓయూ హాస్టళ్లలో విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇందుకోసం ఓయూ రోడ్లు దిగ్బంధం చేయటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కొవిడ్ - 19తో ఉస్మానియాలోని వసతి గృహాలను ఖాళీ చేయాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయినా విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయకపోవటం వల్ల విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు.
అసహనానికి గురైన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. చీకట్లో మగ్గుతోన్న తమ గోడు ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం