హైదరాబాద్లోని నాగోల్ కోఆపరేటివ్ బ్యాంకు కాలనీ రోడ్ నెంబర్ 9లో పురాతన భవనం కూల్చివేస్తుండగా గోడ కూలీ ప్రక్కనే ఉన్న కరెంటు వైర్లపై పడింది. ఈ నేపథ్యంలో మూడు కరెంటు స్తంభాలు విరిగిపోగా, 11కేవీ వైర్లు ఒక్కసారిగా ఇళ్లపై పడగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ట్రాన్స్ఫార్మర్ కూడా ఒరిగి పోయింది. వైర్లు తెగిపడినపుడు కరెంటు సరఫరా కూడా జరుగుతోంది. అక్కడ ఎవరు లేక పోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కరెంటు సప్లై ఆపివేసి పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి : 'అది బూటకపు ఎన్కౌంటర్.. కోర్టు తీర్పు వరకు ఆగాల్సింది'