ETV Bharat / state

REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

author img

By

Published : Aug 28, 2021, 12:47 PM IST

Updated : Aug 28, 2021, 3:44 PM IST

ఓటుకు నోటు కేసులో(Cash for Vote Case) పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహా ఆరుగురికి నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య, వేం కృష్ణ కీర్తన్​లను కూడా అక్టోబరు 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. స్టీఫెన్​సన్​కు ఇచ్చిన రూ.50లక్షలు.. ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్ సమకూర్చినట్లు ఈడీ వెల్లడించింది

Nampally court summons PCC president Revanth Reddy
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

ఓటుకు నోటు కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(enforcement directorate) దాఖలు చేసిన అభియోగపత్రాన్ని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు(Nampally Metropolitan Sessions Judge Court) విచారణకు స్వీకరించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు జారీ చేసింది. బిషప్ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేంతో పాటు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్​కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

కుట్ర జరిగిందన్న ఈడీ..

అక్టోబరు 4న హాజరు కావాలని ఈడీ కేసులను విచారణ జరిపే నాంపల్లి మెట్రో పాలిటన్​సెషన్సు కోర్టు ఆదేశించింది. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కుట్ర జరిగినట్లు ఈడీ(ED) వెల్లడించింది. తెలంగాణ ఏసీబీ (TELANGANA ACB) దాఖలు చేసిన ఛార్జీ​షీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

మే 30న రూ.50 లక్షలు ఇచ్చారు..

రేవంత్​రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్, వేం నరేందర్ రెడ్డి తదితరులను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసిన.. పలు ఆధారాలతో ఇటీవల నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రం సమర్పించింది. వేం నరేందర్ రెడ్డికి మద్దతుగా ఓటేసినా లేదా ఓటింగ్ దూరం ఉన్నా రూ.5 కోట్లు ఇస్తామని నిందితులు పేర్కొంటూ.. 2015 మే 30న రూ.50 లక్షలు ఇచ్చారని ఈడీ వివరించింది.

తాత్కాలిక జప్తు..

తన తండ్రి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు ఆయన కుమారుడు వేం కృష్ణ కీర్తన్ రూ.50 లక్షలను సమకూర్చినట్లు ఈడీ వెల్లడించింది. అనిశా స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల నగదును తాత్కాలిక జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.

ఇదీ చూడండి: పెళ్లింట విషాదం.. కారు ప్రమాదంలో నవవధువు, ఆమె తండ్రి మృతి

ఓటుకు నోటు కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(enforcement directorate) దాఖలు చేసిన అభియోగపత్రాన్ని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు(Nampally Metropolitan Sessions Judge Court) విచారణకు స్వీకరించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు జారీ చేసింది. బిషప్ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేంతో పాటు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్​కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

కుట్ర జరిగిందన్న ఈడీ..

అక్టోబరు 4న హాజరు కావాలని ఈడీ కేసులను విచారణ జరిపే నాంపల్లి మెట్రో పాలిటన్​సెషన్సు కోర్టు ఆదేశించింది. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కుట్ర జరిగినట్లు ఈడీ(ED) వెల్లడించింది. తెలంగాణ ఏసీబీ (TELANGANA ACB) దాఖలు చేసిన ఛార్జీ​షీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

మే 30న రూ.50 లక్షలు ఇచ్చారు..

రేవంత్​రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్, వేం నరేందర్ రెడ్డి తదితరులను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసిన.. పలు ఆధారాలతో ఇటీవల నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రం సమర్పించింది. వేం నరేందర్ రెడ్డికి మద్దతుగా ఓటేసినా లేదా ఓటింగ్ దూరం ఉన్నా రూ.5 కోట్లు ఇస్తామని నిందితులు పేర్కొంటూ.. 2015 మే 30న రూ.50 లక్షలు ఇచ్చారని ఈడీ వివరించింది.

తాత్కాలిక జప్తు..

తన తండ్రి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు ఆయన కుమారుడు వేం కృష్ణ కీర్తన్ రూ.50 లక్షలను సమకూర్చినట్లు ఈడీ వెల్లడించింది. అనిశా స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల నగదును తాత్కాలిక జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.

ఇదీ చూడండి: పెళ్లింట విషాదం.. కారు ప్రమాదంలో నవవధువు, ఆమె తండ్రి మృతి

Last Updated : Aug 28, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.