సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సమీపంలో ముస్లిం మహిళలు నిరసనకు దిగారు. ముంతాజ్ బాగ్లో ఉన్న మియా దర్గాహ్ మైదానంలో బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అర్ధరాత్రి వరకు మహిళలు ఆందోళన విరమించకపోవడం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన ఆపివేయాలని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. మహిళలు వినిపించుకోలేదు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళన చూసి మరికొంత మంది నిరసనకారులు ముంతాజ్ బాగ్ చేరుకున్నారు. సీఏఏను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు ఆందోళన విరమించారు.
- ఇవీ చూడండి: మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!