ETV Bharat / state

Musheerabad fishmarket: మురికి కూపంగా మారిన చేపల మార్కెట్​.. జంకుతున్న జనాలు

author img

By

Published : Jun 13, 2021, 1:51 PM IST

ముషీరాబాద్ చేపల మార్కెట్​ అంతా గుంతలు, మురికి నీరు, చేపల వ్యర్థాలతో నిండిపోయింది. అక్కడ వస్తున్న దుర్వాసన వల్ల ప్రజలు మార్కెట్​కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

musheerabad fish market turned into a dirty coop
చేపల మార్కెట్లో చెత్తా చెదారం... జంకుతున్న జనాలు

హైదరాబాద్​లోని ముషీరాబాద్ చేపల మార్కెట్​కు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. గత నెల 22వ తేదీన చేపల మార్కెట్ పరిసరాల్లో 99 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి గుంతలు తవ్వారు. ఆ పనులు నత్తనడకన సాగుతుండటంతో... ఇటీవల కురిసిన వర్షం కారణంగా మురికి నీరు, మార్కెట్​లోని చెత్తంతా ఆ గుంతల్లో చేరింది. అలాగే చేపలు శుభ్రం చేయగా వచ్చిన వ్యర్థాలు కూడా అవే గుంతల్లోకి వెళ్తున్నాయి. అలాగే రోడ్డు కోసం తవ్విన గుంతల కారణంగా డ్రైనేజీ పైపులు, మురుగు నీటి పైపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మార్కెట్​లో పేరుకుపోయిన చెత్త, మురుగు నీరుతో మార్కెట్​ అంతా దుర్వాసన వస్తోంది.

అడుగు తీసి అడుగు వేయాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. ధైర్యం చేసి వెళ్లిన వాళ్లలో కొందరు ఈ మురికి నీటిలో పడిన సందర్భాలూ ఉన్నాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లేకపోవడం వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది పోయి.. అపరిశుభ్రమైన ప్రాంతంలో మార్కెట్​ని నిర్వహించడం మంచిది కాదని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్​ని బాగు చేయించాలని... అలాగే నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్​లోని ముషీరాబాద్ చేపల మార్కెట్​కు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. గత నెల 22వ తేదీన చేపల మార్కెట్ పరిసరాల్లో 99 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి గుంతలు తవ్వారు. ఆ పనులు నత్తనడకన సాగుతుండటంతో... ఇటీవల కురిసిన వర్షం కారణంగా మురికి నీరు, మార్కెట్​లోని చెత్తంతా ఆ గుంతల్లో చేరింది. అలాగే చేపలు శుభ్రం చేయగా వచ్చిన వ్యర్థాలు కూడా అవే గుంతల్లోకి వెళ్తున్నాయి. అలాగే రోడ్డు కోసం తవ్విన గుంతల కారణంగా డ్రైనేజీ పైపులు, మురుగు నీటి పైపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మార్కెట్​లో పేరుకుపోయిన చెత్త, మురుగు నీరుతో మార్కెట్​ అంతా దుర్వాసన వస్తోంది.

అడుగు తీసి అడుగు వేయాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. ధైర్యం చేసి వెళ్లిన వాళ్లలో కొందరు ఈ మురికి నీటిలో పడిన సందర్భాలూ ఉన్నాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లేకపోవడం వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది పోయి.. అపరిశుభ్రమైన ప్రాంతంలో మార్కెట్​ని నిర్వహించడం మంచిది కాదని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్​ని బాగు చేయించాలని... అలాగే నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.