సికింద్రాబాద్లో మదర్ థెరిస్సా 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, తెలంగాణ మైనారిటీ కమిషనర్ శంకర్తో పాటు ఇండియా ప్రజా బంధు పార్టీ అధ్యక్షుడు రంజిత్ మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదర్ థెరిస్సా అందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
ప్రతి ఒక్కరూ సేవా భావంతో మదర్ థెరిస్సా అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పుల్వామా దాడి: పాక్లో వ్యూహం- అఫ్గాన్లో శిక్షణ