తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినప్పటికీ... తెరాస సర్కారు మంచి పాలనను అందిస్తోందని కితాబిచ్చారు. దేశం గర్వించదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టుని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించగలిగారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'మూడు లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి భారం కాదా..?'