కరోనా నియంత్రణలో జీహెచ్ఎంసీ శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి వెలకట్టలేనిదని వీరికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం, రక్షణతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని.. శానిటేషన్ సిబ్బంది ఇంటి వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫతుల్లాగుడ యానిమల్ కేర్ సెంటర్ నిర్వహణను అక్కడే ఎంటమాలజీ విభాగం ఏర్పాటు చేసిన దోమల నివారణ స్టాల్ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
బల్దియా శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. రూ.13 కోట్ల వ్యయంతో 22 వేల మంది శానిటేషన్, 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ సేఫ్టీ కిట్స్ కిట్స్ ఇస్తున్నామన్నారు. సిబ్బంది అందరు ఈ కిట్స్ను ధరించి విధులకు హాజరు కావాలని సూచించారు. మూడు వారాల్లో సిబ్బంది అందరికి పీపీఈ కిట్స్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?