ETV Bharat / state

'ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై గవర్నర్​కు లేఖ'

author img

By

Published : Dec 26, 2020, 1:46 PM IST

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్​కు సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ప్రత్యేక న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది, తగిన సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు.

cases on mps mlas
'ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై గవర్నర్​కు లేఖ'

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల్లో ప్రభుత్వ న్యాయవాదితో పాటు తగిన సిబ్బందిని నియమించాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్​కు లేఖ రాశారు. విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో 64మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు, 10 మంది ఎంపీలపై 133 కేసులు, మాజీ సభ్యులపై 30 కేసులు నమోదయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో కేవలం 73 కేసుల్లో తీర్పు వచ్చినా... ఎవరికీ శిక్ష పడలేదన్నారు. జిల్లాల్లోని న్యాయస్థానాల్లో 509 కేసులు నమోదు కాగా... 245 కేసులను మాత్రమే ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారని వెల్లడించారు. మిగిలిన కేసులను బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని గవర్నర్​ను కోరారు.

ఇదీ చూడండి:సర్కారీ బడుల బాగుకు 'టాటా' ట్రస్టు ముందడుగు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల్లో ప్రభుత్వ న్యాయవాదితో పాటు తగిన సిబ్బందిని నియమించాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్​కు లేఖ రాశారు. విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో 64మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు, 10 మంది ఎంపీలపై 133 కేసులు, మాజీ సభ్యులపై 30 కేసులు నమోదయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో కేవలం 73 కేసుల్లో తీర్పు వచ్చినా... ఎవరికీ శిక్ష పడలేదన్నారు. జిల్లాల్లోని న్యాయస్థానాల్లో 509 కేసులు నమోదు కాగా... 245 కేసులను మాత్రమే ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారని వెల్లడించారు. మిగిలిన కేసులను బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని గవర్నర్​ను కోరారు.

ఇదీ చూడండి:సర్కారీ బడుల బాగుకు 'టాటా' ట్రస్టు ముందడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.