ETV Bharat / state

లాప్​ట్యాప్​ దొంగ దొరికేశాడు - Laptop Thief in Travels Bus Arrested by KPHB policies in Hyderabad

ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల లాప్​ట్యాప్​లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు.. తమ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. దొంగను అరెస్ట్ చేయటంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు మాదాపూర్ డీసీపీ రివార్డులను అందజేశారు.

లాప్​ట్యాప్​ దొంగ దొరికేశాడు
author img

By

Published : Nov 18, 2019, 8:04 PM IST

ట్రావెల్స్ బస్సుల్లో ఆంధ్ర, రాయలసీమ నుంచి హైదరాబాద్​కు ప్రయాణిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కుసుమ పాల్ రాజ్ విజయవాడ, రాజమండ్రి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేవాడు. ఇతర ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నాక లాప్​ట్యాపులు అపహరించి తరువాయి బస్ స్టేషన్​లో దిగిపోయేవాడు. దొంగిలించిన వస్తువులను రాజమండ్రిలో విక్రయించే వాడు. ఈ విధంగా సంవత్సర కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు.

ఈ రోజు ఉదయం కేపీహెచ్​బీ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించటం వల్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... నిందితుడు చేసిన దొంగతనాల వివరాలు తెలిపాడు. అతని వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన 10 లాప్​ట్యాప్​లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

లాప్​ట్యాప్​ దొంగ దొరికేశాడు

ఇవీ చూడండి : చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ట్రావెల్స్ బస్సుల్లో ఆంధ్ర, రాయలసీమ నుంచి హైదరాబాద్​కు ప్రయాణిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కుసుమ పాల్ రాజ్ విజయవాడ, రాజమండ్రి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేవాడు. ఇతర ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నాక లాప్​ట్యాపులు అపహరించి తరువాయి బస్ స్టేషన్​లో దిగిపోయేవాడు. దొంగిలించిన వస్తువులను రాజమండ్రిలో విక్రయించే వాడు. ఈ విధంగా సంవత్సర కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు.

ఈ రోజు ఉదయం కేపీహెచ్​బీ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించటం వల్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... నిందితుడు చేసిన దొంగతనాల వివరాలు తెలిపాడు. అతని వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన 10 లాప్​ట్యాప్​లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

లాప్​ట్యాప్​ దొంగ దొరికేశాడు

ఇవీ చూడండి : చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.