క్లౌడ్ సర్వీసెస్ అందిస్తోన్న బెంగళూరుకు చెందిన ఎంఫసిస్ అనే ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్లోని రాయదుర్గంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు జాతీయ సరాసరి బెంగళూరు కంటే ఎక్కువ వృద్ధితో పెరుగుతున్నాయని ఆయన అన్నారు. టాస్క్ లాంటి సంస్థలతో కలిసి పనిచేయాలని, తద్వారా కంపెనీ భవిష్యత్తులో ల్యాబ్స్ను హైదరాబాద్లో స్థాపించవచ్చని తెలిపారు. రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. భాగ్యనగరంలో ప్రతిభావంతులైన మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు.
ఇదీ చూడండి :గ్రామాభివృద్ధి కోసం నగలు తాకట్టుపెట్టిన సర్పంచ్