ETV Bharat / state

చిన్నారి ఫాతిమా కిడ్నాప్​ కథ సుఖాంతం - KIDNAP STORY CHASED CHILD REACHED TO PARENTS SAFELY

చిన్నప్పుడు చిత్తు కాగితాలేరుకునే స్నేహం వారిది. పెళ్లిళ్లు, పిల్లల తర్వాత బక్రీద్​కు ముందు రోజు అనుకోకుండా కలుసుకున్నారు. తమ కూతురికి ఆరోగ్యం బాలేక స్నేహితుని దగ్గరే వదిలి వేరే ప్రాంతానికి వెళ్లొచ్చేసరికి ఇద్దరూ కన్పించలేదు. 3 రోజుల పాటు గాంలించిన పోలీసులు చివరికి పాపను సురక్షింతంగా తల్లిదండ్రులకు చేరవేశారు.

KIDNAP STORY CHASED CHILD REACHED TO PARENTS SAFELY
author img

By

Published : Aug 16, 2019, 5:05 PM IST

3 రోజుల క్రితం రాంగోపాల్​పేట్ పీఎస్ పరిధిలో కిడ్నాపైన ఫాతిమా కథ సుఖాంతమైంది. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సీసీ దృశ్యాల ఆధారంగా నిందితుని ఆచూకీ తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనకు అమ్మాయిలు లేని కారణంగానే ఫాతిమాను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు చెప్పారు.

ఫాతిమా తండ్రి రాజు... నిందితుడు సలీం గతంలోనే స్నేహితులని, చెత్త కాగితాలు ఏరుకుని జీవనం సాగించే వారని దర్యాప్తులో తేలిందన్నారు. ఈనెల 11న రాత్రి సమయంలో రాజుకు సలీం కుటుంబంతో సహా కనిపించాడు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లోనే అందరూ కలిసి పడుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అడుక్కునేందుకు వచ్చినట్లు సలీంకు చెప్పాడు. ఫాతిమా ఆరోగ్యం సరిగా లేనందున సలీంను చూసుకోమని చెప్పి... నల్లగుట్టకు వెళ్లారు. మళ్లీ తిరిగివచ్చే సమయానికి తమ కూతురు, సలీం ఇద్దరూ కన్పించకపోయేసరికి ఆందోళనతో... అంతా వెతికారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం కిషన్​బాగ్​లో పాపను కనుగొన్నారు. కేసును మరిన్ని కోణాల్లో విచారణ చేయాల్సి ఉందని...పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

చిన్నారి ఫాతిమా కిడ్నాప్​ కథ సుఖాంతం

ఇవీ చూడండి: సికింద్రాబాద్​ నల్లగుట్టలో కిడ్నాప్ కలకలం

3 రోజుల క్రితం రాంగోపాల్​పేట్ పీఎస్ పరిధిలో కిడ్నాపైన ఫాతిమా కథ సుఖాంతమైంది. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సీసీ దృశ్యాల ఆధారంగా నిందితుని ఆచూకీ తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనకు అమ్మాయిలు లేని కారణంగానే ఫాతిమాను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు చెప్పారు.

ఫాతిమా తండ్రి రాజు... నిందితుడు సలీం గతంలోనే స్నేహితులని, చెత్త కాగితాలు ఏరుకుని జీవనం సాగించే వారని దర్యాప్తులో తేలిందన్నారు. ఈనెల 11న రాత్రి సమయంలో రాజుకు సలీం కుటుంబంతో సహా కనిపించాడు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లోనే అందరూ కలిసి పడుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అడుక్కునేందుకు వచ్చినట్లు సలీంకు చెప్పాడు. ఫాతిమా ఆరోగ్యం సరిగా లేనందున సలీంను చూసుకోమని చెప్పి... నల్లగుట్టకు వెళ్లారు. మళ్లీ తిరిగివచ్చే సమయానికి తమ కూతురు, సలీం ఇద్దరూ కన్పించకపోయేసరికి ఆందోళనతో... అంతా వెతికారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం కిషన్​బాగ్​లో పాపను కనుగొన్నారు. కేసును మరిన్ని కోణాల్లో విచారణ చేయాల్సి ఉందని...పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

చిన్నారి ఫాతిమా కిడ్నాప్​ కథ సుఖాంతం

ఇవీ చూడండి: సికింద్రాబాద్​ నల్లగుట్టలో కిడ్నాప్ కలకలం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.