ETV Bharat / state

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

author img

By

Published : Sep 1, 2020, 5:44 PM IST

Updated : Sep 1, 2020, 7:52 PM IST

భాగ్యనగర వీధులు గణేశుని నామస్మరణతో మారుమోగాయి. 11 రోజుల పాటు పూజలు చేసిన గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఇక ప్రసిద్ది గాంచిన ఖైరతాబాద్ మహా గణపతికి దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. చివరి సారి గణనాథుడిని చూసేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్నారు. భక్తుల కోలాహలం, గణేశుని నామస్మరణల మధ్య ఖైరతాబాద్ వినాయకుడు గంగ ఒడికి చేరాడు.

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

కరోనా ప్రభావం ఈసారి గణేశుని నిమజ్జనంపై స్పష్టంగా కనిపించింది. ప్రతి ఏటా భారీ విగ్రహాలతో లక్షల్లో భక్తులతో కిటకిటలాడే ప్రధాన రహదారుల బోసి పోయాయి. తమ ఇంట్లో కొలువుదీరిన చిన్న చిన్న గణనాథులను తీసుకుని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో మాత్రమే భక్తులు నిమజ్జనం చేసేందుకు వచ్చారు.

ఈ సారి 9 అడుగులకే పరిమితమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కూడా నిడారంబరంగానే సాగింది. ప్రతి ఏటా భారీ కాయంతో, విభిన్న రూపాలతో అలరించే గణనాథుడు ఈ సారి కరోనాని పారద్రోలే ధన్వంతరి నారాయణ అవతారంతో ధర్శనం ఇచ్చాడు. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటి సభ్యులు యోచించిన... పోలీసుల అనుమతి లభించకపోవడం వల్ల యథావిధిగా హుస్సేన్ సాగర్​లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల కోలాహలం నడుమ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. రాజ్ ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి పైవంతెన, పాత సెక్రటేరియట్ మీదుగా శోభాయాత్ర జరిగింది. ఖైరతాబాద్ గణనాథునికి అడుగడుగునా భక్తులు బ్రహ్మరథం పట్టారు. సాయంత్రం 5.25 గంటల సమయంలో కలశ పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత గణేశుని నామస్మరణల మద్య తల్లి గంగమ్మ ఒడికి చేర్చారు.

ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే..

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

కరోనా ప్రభావం ఈసారి గణేశుని నిమజ్జనంపై స్పష్టంగా కనిపించింది. ప్రతి ఏటా భారీ విగ్రహాలతో లక్షల్లో భక్తులతో కిటకిటలాడే ప్రధాన రహదారుల బోసి పోయాయి. తమ ఇంట్లో కొలువుదీరిన చిన్న చిన్న గణనాథులను తీసుకుని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో మాత్రమే భక్తులు నిమజ్జనం చేసేందుకు వచ్చారు.

ఈ సారి 9 అడుగులకే పరిమితమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కూడా నిడారంబరంగానే సాగింది. ప్రతి ఏటా భారీ కాయంతో, విభిన్న రూపాలతో అలరించే గణనాథుడు ఈ సారి కరోనాని పారద్రోలే ధన్వంతరి నారాయణ అవతారంతో ధర్శనం ఇచ్చాడు. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటి సభ్యులు యోచించిన... పోలీసుల అనుమతి లభించకపోవడం వల్ల యథావిధిగా హుస్సేన్ సాగర్​లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల కోలాహలం నడుమ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. రాజ్ ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి పైవంతెన, పాత సెక్రటేరియట్ మీదుగా శోభాయాత్ర జరిగింది. ఖైరతాబాద్ గణనాథునికి అడుగడుగునా భక్తులు బ్రహ్మరథం పట్టారు. సాయంత్రం 5.25 గంటల సమయంలో కలశ పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత గణేశుని నామస్మరణల మద్య తల్లి గంగమ్మ ఒడికి చేర్చారు.

ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే..

Last Updated : Sep 1, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.