ETV Bharat / state

'రుణాలపై పొరుగు రాష్ట్రాలేం చేస్తున్నాయ్‌'.. అధికారులతో సీఎం కేసీఆర్

author img

By

Published : Jul 28, 2022, 6:52 AM IST

CM KCR Delhi tour : తెలంగాణ రాష్ట్రం వివిధ అంశాల్లో మంచి పనితీరు కనబర్చుతున్నా రుణాల సేకరణకు ఆంక్షలు పెడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలపై పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయని.. వారు ఎలాంటి విధానాలు అవలంబిస్తూన్నారనే అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.

CM KCR Delhi tour
కేసీఆర్‌

CM KCR Delhi tour : తెలంగాణ రాష్ట్రం వివిధ అంశాల్లో మంచి పనితీరు కనబర్చుతున్నా రుణాల సేకరణకు ఆంక్షలు పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. దిల్లీలో వరుసగా రెండోరోజూ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మరోవైపు తెలంగాణ కొత్తగా రూ.10 వేల కోట్ల రుణాలు పొందేందుకు ఆంక్షల్లో సడలింపు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత కనబర్చినట్లు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాళేశ్వరం ఎత్తిపోతల సంస్థకు రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) పెట్టిన షరతులపై బుధవారం చర్చించారు. ఆ సంస్థలు పెడుతున్న కొత్త షరతులపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర మార్గాల్లో తీసుకునే అప్పులకు అడ్డుగా మారుతున్న కేంద్ర నిర్ణయాలపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రుణాల సేకరణకు కేంద్రం అనుసరిస్తున్న బాటలోనే రాష్ట్రమూ వెళ్లేందుకు వీలుందా అనే అంశాన్నీ పరిశీలించాలని సూచించారు.

విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్ల రుణాలు పొందేందుకు అనుమతి.. తెలంగాణపై విధించిన రుణ ఆంక్షల్లో కొంతమేరకు సడలింపులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపినట్లు తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కొత్తగా మరో రూ.10వేల కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బుధవారం దిల్లీలో ఆయా శాఖల కేంద్ర కార్యదర్శులను కలిశారు.

రాష్ట్రంలో ఆది నుంచి వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలు, తిరిగిచెల్లింపు, ప్రాజెక్టుల నిర్మాణాలు, పురోగతి, ప్రయోజనాల గురించి వివరించారు. రాష్ట్రంపై విధించిన ఆంక్షల్లో సడలింపులు కోరారు. చర్చల అనంతరం విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం కొత్తగా రూ.10వేల కోట్ల మేరకు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని సీఎంకు అధికారులు వివరించారని తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ- అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, పురోగతిని వివరించాలని, అన్ని రకాల ఆంక్షలను సడలించేలా కోరాలని సూచించినట్లు సమాచారం.

CM KCR Delhi tour : తెలంగాణ రాష్ట్రం వివిధ అంశాల్లో మంచి పనితీరు కనబర్చుతున్నా రుణాల సేకరణకు ఆంక్షలు పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. దిల్లీలో వరుసగా రెండోరోజూ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మరోవైపు తెలంగాణ కొత్తగా రూ.10 వేల కోట్ల రుణాలు పొందేందుకు ఆంక్షల్లో సడలింపు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత కనబర్చినట్లు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాళేశ్వరం ఎత్తిపోతల సంస్థకు రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) పెట్టిన షరతులపై బుధవారం చర్చించారు. ఆ సంస్థలు పెడుతున్న కొత్త షరతులపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర మార్గాల్లో తీసుకునే అప్పులకు అడ్డుగా మారుతున్న కేంద్ర నిర్ణయాలపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రుణాల సేకరణకు కేంద్రం అనుసరిస్తున్న బాటలోనే రాష్ట్రమూ వెళ్లేందుకు వీలుందా అనే అంశాన్నీ పరిశీలించాలని సూచించారు.

విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్ల రుణాలు పొందేందుకు అనుమతి.. తెలంగాణపై విధించిన రుణ ఆంక్షల్లో కొంతమేరకు సడలింపులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపినట్లు తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కొత్తగా మరో రూ.10వేల కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బుధవారం దిల్లీలో ఆయా శాఖల కేంద్ర కార్యదర్శులను కలిశారు.

రాష్ట్రంలో ఆది నుంచి వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలు, తిరిగిచెల్లింపు, ప్రాజెక్టుల నిర్మాణాలు, పురోగతి, ప్రయోజనాల గురించి వివరించారు. రాష్ట్రంపై విధించిన ఆంక్షల్లో సడలింపులు కోరారు. చర్చల అనంతరం విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం కొత్తగా రూ.10వేల కోట్ల మేరకు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని సీఎంకు అధికారులు వివరించారని తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ- అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, పురోగతిని వివరించాలని, అన్ని రకాల ఆంక్షలను సడలించేలా కోరాలని సూచించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.