సికింద్రాబాద్ చిలకలగూడ ఠాణా పరిధిలో విషాదం జరిగింది. ఇంటి నుంచి అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని మయూరి అనుమాన్పద స్థితిలో శవమై కనిపించింది. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన మయూరి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తమ కుమార్తె గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె ఇంటికి సమీపంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరిన పోలీసులు... ఆ మృతదేహం విద్యార్థిని మయూరిదిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న దంపతులు