సికింద్రాబాద్లోని కార్ఖానాలో ఉదయ్కుమార్ అనే ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉదయ్కుమార్.. ఈనెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఉదయ్కుమార్ సీతాఫల్మండిలోని తన బాబాయ్ కొడుకు ఆనంద్తో కలిసి చదువుకుంటున్నాడు. ఈనెల 1న తన ఇంటికి వెళ్లి దుస్తులు, ఆధార్కార్డు, పలు ధ్రువపత్రాలు తీసుకుని సీతాఫల్మండికి వచ్చాడు. 4వ తేదీన హాల్ టికెట్ కోసం వెళ్తున్నట్లు ఇంట్లో వాళ్లకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్కుమార్ కనిపించక పోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ఉదయ్కుమార్ 5 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. పరీక్షల భయంతోనే ఇంటిని వీడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు