స్టేషనరీకి వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓల్డ్ అల్వాల్ సిటిజెన్ కాలనీలో నివాసం ఉంటున్న షేర్మియా అనే బాలిక సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు.
స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహితుల, బంధువుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఆచూకీ లేకుండా పోయిందని ఆందోళనకు గురవుతున్నారు.
అల్వాల్ పోలీసులు.. అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చూడండి: జిల్లాలో గుప్త నిధుల కలకలం.. పరిశీలించిన అధికారులు