ETV Bharat / state

IAS Officer Sridevi Reaction On Her Transfer : "మూడు రోజుల ముందే బాధ్యత తీసుకుంటే.. ఆ శాఖ పనితీరుకు నేను బాధ్యురాలినా?"

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 2:27 PM IST

IAS Officer Sridevi Reaction On Her Transfer : కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​గా బాధ్యతలు తీసుకుంటే.. ఆ శాఖ పని తీరుకు తాను ఎలా బాధ్యురాలిని అవుతాను అంటూ ఐఏఎస్​ అధికారిణి టీకే శ్రీదేవి ప్రశ్నించారు. ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించడమే కాకుండా.. బదిలీ చేయడంపై ఎక్స్​ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

sreedevi ias
sreedevi ias

IAS Officer Sridevi Reaction On Her Transfer : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​గా బాధ్యతలు తీసుకుంటే.. ఆ శాఖ పని తీరుకు తాను బాధ్యురాలిని అవుతానా అంటూ ఐఏఎస్​ అధికారిణి టీకే శ్రీదేవి ఎక్స్ (ట్విటర్​) వేదికగా ప్రశ్నించారు. తను రాక ముందు ఆ శాఖ పని తీరు బాగోలేకపోతే తనను.. ట్రాన్స్​ఫర్​ చేయడం ఏంటని అసహనానికి గురయ్యారు.

రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిలో నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్​ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్​, రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​ ఉన్నారు. వీరందరికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని సీఎస్​కు స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలు రాసింది.

  • How can an officer who has taken charge 3 working days before the visit of the CEC to the state held responsible for the performance of the department? Just asking??

    — TK Sreedevi (@tksreedevi) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​గా బాధ్యత తీసుకుంటే.. ఆ శాఖ పనితీరుకు నేను బాధ్యురాలినా?. నేను రాక ముందు ఆ శాఖ పనితీరు బాగోలేకపోతే నన్నెలా బదిలీ చేస్తారు." - టీ.కే. శ్రీదేవి, ఐఏఎస్​ అధికారిణి

EC Focus on Critical Constituencies in Telangana : ఆ నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్​ ఫోకస్​.. రాష్ట్రానికి త్వరలో పరిశీలకులు

బదిలీ అయిన అధికారుల వివరాలు.. రంగారెడ్డి కలెక్టర్​ హరీశ్​, మేడ్చల్​ కలెక్టర్​ అమోయ్​ కుమార్​, యాదాద్రి కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి, నిర్మల్​ కలెక్టర్​ వరుణ్​రెడ్డిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్​ కమిషనర్​ సీవీ ఆనంద్​, వరంగల్​ సీపీ రంగనాథ్​, నిజామాబాద్​ సీపీ సత్యనారాయణను బదిలీ చేశారు. సూర్యాపేట ఎస్పీగా ఉన్న ఐపీఎస్​ అధికారి రాజేంద్ర ప్రసాద్​తో పాటు.. తొమ్మిది మంది నాన్​కేడర్​ ఎస్పీలకు స్థానచలనం కలిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్​ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Central Election Commission Transfer 20 Officers in Telangana : అలాగే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​ టీకే శ్రీదేవి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్​ శాఖ సంచాలకులు ముషారఫ్​ అలీని బదిలీ చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు.. బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని వారిని వెంటనే మార్చాలని విపక్షాలు.. కేంద్ర ఎన్నికల కమిషన్​కు లేఖ రాశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్​ 20 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు పేజీల లేఖను రాసింది. ఇప్పటికే హుజూరాబాద్​, మునుగోడు ఎన్నికల్లో పోలీసుల తీరుపై కూడా ఈసీ మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్

EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

IAS Officer Sridevi Reaction On Her Transfer : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​గా బాధ్యతలు తీసుకుంటే.. ఆ శాఖ పని తీరుకు తాను బాధ్యురాలిని అవుతానా అంటూ ఐఏఎస్​ అధికారిణి టీకే శ్రీదేవి ఎక్స్ (ట్విటర్​) వేదికగా ప్రశ్నించారు. తను రాక ముందు ఆ శాఖ పని తీరు బాగోలేకపోతే తనను.. ట్రాన్స్​ఫర్​ చేయడం ఏంటని అసహనానికి గురయ్యారు.

రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిలో నలుగురు కలెక్టర్లు, హైదరాబాద్​ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, ఆబ్కారీశాఖ డైరెక్టర్​, రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​ ఉన్నారు. వీరందరికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని సీఎస్​కు స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో పనితీరు సంతృప్తికరంగా లేకపోవటంతోనే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నాలుగు లేఖలు రాసింది.

  • How can an officer who has taken charge 3 working days before the visit of the CEC to the state held responsible for the performance of the department? Just asking??

    — TK Sreedevi (@tksreedevi) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు 3 రోజుల ముందే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​గా బాధ్యత తీసుకుంటే.. ఆ శాఖ పనితీరుకు నేను బాధ్యురాలినా?. నేను రాక ముందు ఆ శాఖ పనితీరు బాగోలేకపోతే నన్నెలా బదిలీ చేస్తారు." - టీ.కే. శ్రీదేవి, ఐఏఎస్​ అధికారిణి

EC Focus on Critical Constituencies in Telangana : ఆ నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్​ ఫోకస్​.. రాష్ట్రానికి త్వరలో పరిశీలకులు

బదిలీ అయిన అధికారుల వివరాలు.. రంగారెడ్డి కలెక్టర్​ హరీశ్​, మేడ్చల్​ కలెక్టర్​ అమోయ్​ కుమార్​, యాదాద్రి కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి, నిర్మల్​ కలెక్టర్​ వరుణ్​రెడ్డిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్​ కమిషనర్​ సీవీ ఆనంద్​, వరంగల్​ సీపీ రంగనాథ్​, నిజామాబాద్​ సీపీ సత్యనారాయణను బదిలీ చేశారు. సూర్యాపేట ఎస్పీగా ఉన్న ఐపీఎస్​ అధికారి రాజేంద్ర ప్రసాద్​తో పాటు.. తొమ్మిది మంది నాన్​కేడర్​ ఎస్పీలకు స్థానచలనం కలిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్​ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Central Election Commission Transfer 20 Officers in Telangana : అలాగే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్​ టీకే శ్రీదేవి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్​ శాఖ సంచాలకులు ముషారఫ్​ అలీని బదిలీ చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు.. బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని వారిని వెంటనే మార్చాలని విపక్షాలు.. కేంద్ర ఎన్నికల కమిషన్​కు లేఖ రాశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్​ 20 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు పేజీల లేఖను రాసింది. ఇప్పటికే హుజూరాబాద్​, మునుగోడు ఎన్నికల్లో పోలీసుల తీరుపై కూడా ఈసీ మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్

EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.