ETV Bharat / state

ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం నాకుంది: కిషన్​ రెడ్డి - ఏపీ భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడలో భాజపా కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం తనకు ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

i-am-confident-that-the-bjp-will-strengthen-in-the-ap-kishan-reddy
ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం నాకుంది: కిషన్​ రెడ్డి
author img

By

Published : Oct 25, 2020, 5:53 PM IST

రానున్న రోజుల్లో ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం తనకు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... ప్రధాని మోదీ, నడ్డా సారథ్యంలో భాజపా బలోపేతమవుతుందన్నారు. పదవుల్లో ఉన్నా.., లేకున్నా నేతలు కుటుంబంలా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం నాకుంది: కిషన్​ రెడ్డి

పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్, మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, సీఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న కిషన్ రెడ్డి

విజయవాడ కనకదుర్గమ్మను ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాదం పథకం ద్వారా ఆలయానికి రూ. 85 కోట్లు మంజూరు చేయాలని ఈవో సురేశ్​బాబు కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఇదీచదవండి: చెడుపై విజయానికి చిహ్నమే విజయదశమి: బండి సంజయ్

రానున్న రోజుల్లో ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం తనకు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... ప్రధాని మోదీ, నడ్డా సారథ్యంలో భాజపా బలోపేతమవుతుందన్నారు. పదవుల్లో ఉన్నా.., లేకున్నా నేతలు కుటుంబంలా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఏపీలో భాజపా బలపడుతుందనే విశ్వాసం నాకుంది: కిషన్​ రెడ్డి

పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్, మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, సీఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న కిషన్ రెడ్డి

విజయవాడ కనకదుర్గమ్మను ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాదం పథకం ద్వారా ఆలయానికి రూ. 85 కోట్లు మంజూరు చేయాలని ఈవో సురేశ్​బాబు కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఇదీచదవండి: చెడుపై విజయానికి చిహ్నమే విజయదశమి: బండి సంజయ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.