కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభించింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్ రోడ్డు, విద్యానగర్, రామ్ నగర్, చిక్కడ్పల్లి తదితర ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆ ప్రాంత ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలవు దినాల్లో ఎన్టీఆర్ గ్రౌండ్ చిన్నారులు, యువకుల ఆటలతో కళకళలాడేది. కానీ జనతా కర్ఫ్యూ నేపథ్యంలో గ్రౌండ్ బోసిపోయింది.
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడం కోసం ప్రభుత్వం చేపట్టిన జనతా కర్ఫ్యుకు అందరూ సహకరించాలంటూ చిక్కడ్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఫ్లకార్డులు చేత పట్టుకొని రోడ్డుపై ప్రదర్శన నిర్వహించారు. అత్యవసర సమయాల్లో బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా నోటికి మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. ఎవరితో తమకు సంబంధం లేదనే విధంగా మున్సిపల్ సిబ్బంది రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.
ఇవీ చూడండి: నాంపల్లిలో కరోనా అనుమానితుడు.. గాంధీకి తరలింపు..