గోల్కొండ కోట వద్ద చేపట్టిన పైప్లైన్ పనులను వెంటనే నిలిపివేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. రెండు బురుజుల మధ్య పైప్లైన్ కోసం కందకం తవ్వుతోందని.. దానివల్ల పురాతన గోల్కొండ కోట దెబ్బతింటోందని దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది.
తవ్వకాలు నిలిపివేయాలని తాము జీహెచ్ఎంసీ కోరినప్పటికీ... పనులు చేపడుతోందని పురావస్తు శాఖ పేర్కొంటున్నట్లు ఆ కథనం పేర్కొంది. స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం తాము తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు.. పైప్లైన్ పనులను వెంటనే నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పురావస్తు శాఖ, జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న కట్టడాల వివరాలు తెలపాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: కొలను కాలుష్యంపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం