ఇవీ చూడండి:ఎం-3 ఈవీఎంల కోసం దేశమంతటా అన్వేషణ
కే.కే శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. భద్రతాపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర పోలీస్ పరిశీలకులు కేకే శర్మ అధ్యక్షతన ఇవాళ సమావేశం జరగనుంది.
నేడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశం
లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలపై నేడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర పోలీస్ పరిశీలకులు కే.కే శర్మ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు.ఉన్నతాధికారులు డీజీపీ మహేందర్ రెడ్డి, సీ.ఈ.ఓ రజత్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్, ముగ్గురు పోలీస్ కమీషనర్లు, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొననున్నారు. అనంతరం రాజకీయ పార్టీలతో ఆయన సమావేశం కానున్నారు.
ఇవీ చూడండి:ఎం-3 ఈవీఎంల కోసం దేశమంతటా అన్వేషణ