ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు 2006లో జూనియర్ లైన్మెన్ 2,553 పోస్టులకుగాను టీఎస్ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు తెలంగాణలోని వందలాది మంది ఐటీఐ అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వారికి 2013లో టీఎసీఎస్పీడీసీఎల్ పోల్ క్లైమ్ పరీక్షను యాజమాన్యం నిర్వహించింది.
హైకోర్టు తీర్పుతో అభ్యర్థులకు ఊరట
అయితే ఆపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎవ్వరికీ ఇంతవరకు ఉద్యోగం ఇవ్వకపోవడం వల్ల అభ్యర్థుల తరఫున హైకోర్టులో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ రిట్ పిటిషన్ వేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ధర్మాసనం 2006లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులతో పాటు పోల్క్లైమ్ పరీక్షపాస్ అయిన వారందర్నీ జూనియర్ లైన్మెన్లుగా ఉద్యోగంలోకి తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన తీర్పు ఇచ్చారు.
ఇదీ చూడండి: 'బీమా చెల్లించినా... రైతులకు పరిహారం ఎందుకు చెల్లించడం లేదు'