ETV Bharat / state

నిండాముంచిన నివర్‌... పంటలు జలమయం

author img

By

Published : Nov 29, 2020, 7:00 AM IST

నివర్‌ తుపాన్... కృష్ణా డెల్టా, ప్రకాశం రైతుల్ని నిండా ముంచింది. కృష్ణానది వరదల నుంచి తేరుకోక ముందే ఎడతెరిపి లేని వర్షాల రూపంలో పంజా విసిరింది. డెల్టాలో వరి సాగు చేసిన రైతులు నీటమునిగిన పంటను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. పంట చేతికొచ్చే తరుణంలో నీటి పాలవటం అన్నదాతలను కుంగదీస్తోంది.

heavy-crop-loss-over-niver-storm-in andhra pradesh
రైతుల్ని నిండాముంచిన నివర్‌
రైతుల్ని నిండాముంచిన నివర్‌

ఏపీని అన్నపూర్ణగా నిలపటంలో కృష్ణా డెల్టాది కీలకపాత్ర. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కృష్ణా తీరంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు వెంట భారీగా వరి సాగు చేస్తారు. 3 రోజుల నుంచి నివర్ తుపాన్ ప్రభావం కారణంగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో వరి కోతలు చేపట్టనున్న తరుణంలో... ఈ వాన ముప్పుతో ఆరుగాలం కృషి నీటిపాలైంది. ఈ ఏడాదిలో వర్షాలు సకాలంలో పడడం, సాగునీరు అందుబాటులోకి రావటంతో వరి బాగా పండింది. గింజలతో వరి కంకులు నిండుగా ఉన్నాయి. వర్షం, గాలుల కారణంగా కోసే తరుణంలో వరిపైరు నేల వాలింది. పొలాల్లోకి చేరిన వర్షపు నీరు పైరుని కప్పేసింది. గాలుల తీవ్రతకు పైరు పూర్తిగా పడిపోయి... నీటిలో నానుతుండటంతో పంట చేతికి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.

లక్షల ఎకరాలు వర్షార్పణం...

వర్షానికి పడిపోయిన వరి కంకుల నుంచి మొలకలొస్తున్నాయి. కొందరు రైతులు పైరు కోసి బోదెలు వేసినా నూర్పిడి చేయలేదు. అక్కడ కూడా పైరు నీటిలో చిక్కుకుంది. జిల్లాలోని 34 మండలాలు, 400 గ్రామాల పరిధిలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఏపీలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే వరిపంటకు నష్టం జరిగింది. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం.. 3.10 లక్షల ఎకరాల్లో వరిపైరు నీట మునిగినట్లు ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముఖ్యంగా పశ్చిమ డెల్టాలో ఎక్కువ నష్టం జరిగింది. ఈసారి ప్రకృతి అనుకూలించటంతో ఎకరాకు 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు భావించారు. నివర్ కారణంగా వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం ఖరారు చేసిన ధర రూ.1416 ప్రకారం చూసినా... వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

జలమయమైన కృష్ణా

కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న కృష్ణా జిల్లాలోనూ నివర్ ప్రభావం అధికంగానే ఉంది. ఈ జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా... సగానికి పైగా విస్తీర్ణంలోని పంట వర్షాలతో దెబ్బతింది. 2.35 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ధాన్యం తడిసిపోయి, కంకులు నేల రాలిపోతున్నాయి. పశ్చిమ కృష్ణా ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వేరుసెనగ, పత్తి, మినుము పంటలు బాగా దెబ్బతిన్నాయి.

ఎడతెరిపి లేకుండా...

గుంటూరు జిల్లాలో శుక్రవారం సగటు వర్షపాతం 7.3 సెంటీమీటర్లుగా నమోదైంది. బాపట్ల, దుగ్గిరాల, తెనాలి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. 2 రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో పొలాలన్నీ నీటిలోనే నానుతున్నాయి. డ్రెయిన్లు పూడుకుపోయి ఉండటంతో పంట పొలాల్లోని నీరు బయటకు వెళ్లే పరిస్థితిలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువున తాడేపల్లి మొదలుకుని రేపల్లె, బాపట్ల తీర మండలాల వరకు వాన నీటిలోనే ఓదెలున్నాయి. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, రేపల్లె, పొన్నూరు నియోజకవర్గాల్లోనూ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. పల్నాడు ప్రాంతంలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. కోత దశలో ఉన్న వరి పంట.. పొలంలోనే పడిపోయింది. పడిపోయిన వరి ఓదెలను నిలబెట్టేందుకు రైతులు యత్నించినా.. అప్పటికే పూర్తిగా తడిసిపోయాయి. వరి కంకి దశలో ఉందని... ఇపుడు నీటిలో నానితే గింజలు మొలకెత్తటం, రంగు మారుతాయని రైతులు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు.

రంగు మారితే కొంటారా?

పొలాల్లో నీరు తగ్గిన తర్వాత ఓదెల్ని తొలగిస్తే గింజలు సగానికి సగం రాలిపోతాయి. మిగిలిన సగం కూడా నాణ్యత తగ్గుతుంది. ధాన్యం రంగు మారితే మార్కెట్​లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. వరి పడిపోయినప్పుడు ఎండ్రకాయలు, ఎలుకలు వరి కంకులపై మట్టి తోడుతాయి. అందుకే ప్రభుత్వం రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు ఊరట లభిస్తుంది.

పెట్టుబడులు నీటిపాలు...

వరి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.20వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులైతే రూ.25వేల వరకూ ముందస్తుగానే కౌలు చెల్లించారు. ఈ ప్రకారం ఎకరాకు రూ.45వేలు ఖర్చు చేశారు. పంట బాగా పండితే ఎంతో కొంత చేతికొచ్చేది. వారం రోజుల్లో కోతలు ఉండగా పంట నీట మునగటం రైతులను కుంగదీస్తోంది. తుపాను దెబ్బకు పెట్టిన పెట్టబడులు వెనక్కు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఆగి, పొలంలో నీరు తగ్గిన తర్వాత మాత్రమే పంట కోత సాధ్యమవుతుంది. అప్పుడు వరికోత యంత్రాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగితే... అద్దె పెరిగే అవకాశం ఉంది. కోత కోసే సమయంలో మట్టి ధాన్యంలోకి రావడం వల్ల నాణ్యత సైతం తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు అన్నదాతలు.

నీటిలో పంటలు...

గుంటూరు జిల్లాలో మినుప, పెసర, పంటలు మరో 1300 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 3 వేల 500 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. మిర్చి పంట అత్యధికంగా 3వేల హెక్టార్లలో నీటిలోనే ఉండిపోయింది. రైతులకు పైసా చేతికి వచ్చే అవకాశం లేదు. అలాగే కూరగాయలు, అరటి, బొప్పాయి, కంద, పసుపు పంటలు కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి.

పొంగుతోన్న వాగులు, వంకలు

ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించటంతో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అద్దంకి, గిద్దలూరు, అర్థవీడు, కంభం, బెస్తవారిపేట, గిద్దలూరు మండలాల్లో మిర్చి, శనగ, వరి పంట దెబ్బతింది. భారీ వర్షాలకు జిల్లాలో దాదాపు 100 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఎడతెగని వాన పడటంతో కందుకూరులో ఎర్రవాగు, గుడ్లూరులో ఉప్పుటేరు, తాళ్లూరులో దోర్నపు వాగులు పొంగాయి. చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు నీట మునిగాయి. 35 మండలాల్లో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్ష హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగి 50 శాతానికి పైగా పంటకు నష్టం వాటిల్లింది.

ఇదీ చదవండీ: పట్టువదలని రైతన్న.. ఉద్ధృతంగా 'దిల్లీ చలో'

రైతుల్ని నిండాముంచిన నివర్‌

ఏపీని అన్నపూర్ణగా నిలపటంలో కృష్ణా డెల్టాది కీలకపాత్ర. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కృష్ణా తీరంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు వెంట భారీగా వరి సాగు చేస్తారు. 3 రోజుల నుంచి నివర్ తుపాన్ ప్రభావం కారణంగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో వరి కోతలు చేపట్టనున్న తరుణంలో... ఈ వాన ముప్పుతో ఆరుగాలం కృషి నీటిపాలైంది. ఈ ఏడాదిలో వర్షాలు సకాలంలో పడడం, సాగునీరు అందుబాటులోకి రావటంతో వరి బాగా పండింది. గింజలతో వరి కంకులు నిండుగా ఉన్నాయి. వర్షం, గాలుల కారణంగా కోసే తరుణంలో వరిపైరు నేల వాలింది. పొలాల్లోకి చేరిన వర్షపు నీరు పైరుని కప్పేసింది. గాలుల తీవ్రతకు పైరు పూర్తిగా పడిపోయి... నీటిలో నానుతుండటంతో పంట చేతికి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.

లక్షల ఎకరాలు వర్షార్పణం...

వర్షానికి పడిపోయిన వరి కంకుల నుంచి మొలకలొస్తున్నాయి. కొందరు రైతులు పైరు కోసి బోదెలు వేసినా నూర్పిడి చేయలేదు. అక్కడ కూడా పైరు నీటిలో చిక్కుకుంది. జిల్లాలోని 34 మండలాలు, 400 గ్రామాల పరిధిలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఏపీలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే వరిపంటకు నష్టం జరిగింది. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం.. 3.10 లక్షల ఎకరాల్లో వరిపైరు నీట మునిగినట్లు ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముఖ్యంగా పశ్చిమ డెల్టాలో ఎక్కువ నష్టం జరిగింది. ఈసారి ప్రకృతి అనుకూలించటంతో ఎకరాకు 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు భావించారు. నివర్ కారణంగా వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం ఖరారు చేసిన ధర రూ.1416 ప్రకారం చూసినా... వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

జలమయమైన కృష్ణా

కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న కృష్ణా జిల్లాలోనూ నివర్ ప్రభావం అధికంగానే ఉంది. ఈ జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా... సగానికి పైగా విస్తీర్ణంలోని పంట వర్షాలతో దెబ్బతింది. 2.35 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ధాన్యం తడిసిపోయి, కంకులు నేల రాలిపోతున్నాయి. పశ్చిమ కృష్ణా ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వేరుసెనగ, పత్తి, మినుము పంటలు బాగా దెబ్బతిన్నాయి.

ఎడతెరిపి లేకుండా...

గుంటూరు జిల్లాలో శుక్రవారం సగటు వర్షపాతం 7.3 సెంటీమీటర్లుగా నమోదైంది. బాపట్ల, దుగ్గిరాల, తెనాలి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. 2 రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో పొలాలన్నీ నీటిలోనే నానుతున్నాయి. డ్రెయిన్లు పూడుకుపోయి ఉండటంతో పంట పొలాల్లోని నీరు బయటకు వెళ్లే పరిస్థితిలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువున తాడేపల్లి మొదలుకుని రేపల్లె, బాపట్ల తీర మండలాల వరకు వాన నీటిలోనే ఓదెలున్నాయి. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, రేపల్లె, పొన్నూరు నియోజకవర్గాల్లోనూ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. పల్నాడు ప్రాంతంలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. కోత దశలో ఉన్న వరి పంట.. పొలంలోనే పడిపోయింది. పడిపోయిన వరి ఓదెలను నిలబెట్టేందుకు రైతులు యత్నించినా.. అప్పటికే పూర్తిగా తడిసిపోయాయి. వరి కంకి దశలో ఉందని... ఇపుడు నీటిలో నానితే గింజలు మొలకెత్తటం, రంగు మారుతాయని రైతులు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు.

రంగు మారితే కొంటారా?

పొలాల్లో నీరు తగ్గిన తర్వాత ఓదెల్ని తొలగిస్తే గింజలు సగానికి సగం రాలిపోతాయి. మిగిలిన సగం కూడా నాణ్యత తగ్గుతుంది. ధాన్యం రంగు మారితే మార్కెట్​లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. వరి పడిపోయినప్పుడు ఎండ్రకాయలు, ఎలుకలు వరి కంకులపై మట్టి తోడుతాయి. అందుకే ప్రభుత్వం రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు ఊరట లభిస్తుంది.

పెట్టుబడులు నీటిపాలు...

వరి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.20వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులైతే రూ.25వేల వరకూ ముందస్తుగానే కౌలు చెల్లించారు. ఈ ప్రకారం ఎకరాకు రూ.45వేలు ఖర్చు చేశారు. పంట బాగా పండితే ఎంతో కొంత చేతికొచ్చేది. వారం రోజుల్లో కోతలు ఉండగా పంట నీట మునగటం రైతులను కుంగదీస్తోంది. తుపాను దెబ్బకు పెట్టిన పెట్టబడులు వెనక్కు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఆగి, పొలంలో నీరు తగ్గిన తర్వాత మాత్రమే పంట కోత సాధ్యమవుతుంది. అప్పుడు వరికోత యంత్రాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగితే... అద్దె పెరిగే అవకాశం ఉంది. కోత కోసే సమయంలో మట్టి ధాన్యంలోకి రావడం వల్ల నాణ్యత సైతం తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు అన్నదాతలు.

నీటిలో పంటలు...

గుంటూరు జిల్లాలో మినుప, పెసర, పంటలు మరో 1300 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 3 వేల 500 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. మిర్చి పంట అత్యధికంగా 3వేల హెక్టార్లలో నీటిలోనే ఉండిపోయింది. రైతులకు పైసా చేతికి వచ్చే అవకాశం లేదు. అలాగే కూరగాయలు, అరటి, బొప్పాయి, కంద, పసుపు పంటలు కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి.

పొంగుతోన్న వాగులు, వంకలు

ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించటంతో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అద్దంకి, గిద్దలూరు, అర్థవీడు, కంభం, బెస్తవారిపేట, గిద్దలూరు మండలాల్లో మిర్చి, శనగ, వరి పంట దెబ్బతింది. భారీ వర్షాలకు జిల్లాలో దాదాపు 100 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఎడతెగని వాన పడటంతో కందుకూరులో ఎర్రవాగు, గుడ్లూరులో ఉప్పుటేరు, తాళ్లూరులో దోర్నపు వాగులు పొంగాయి. చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు నీట మునిగాయి. 35 మండలాల్లో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్ష హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగి 50 శాతానికి పైగా పంటకు నష్టం వాటిల్లింది.

ఇదీ చదవండీ: పట్టువదలని రైతన్న.. ఉద్ధృతంగా 'దిల్లీ చలో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.