నిర్మల్ జిల్లా ఎల్లంపూర్ గ్రామానికి చెందిన మోకాని లక్ష్మణ్ నాలుగు డబ్బులు సంపాదించుకుందామని పుట్టిన ఊరుని, దేశాన్ని వదిలి దుబాయ్ వెళ్లాడు. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని రెండు కాళ్లు విరిగాయి. అక్కడ స్నేహితుల సహాయంతో లక్ష్మణ్ ఆసుపత్రిలో చేరాడు.
స్వదేశానికి వచ్చే ఆర్థిక స్థోమత లేక అక్కడే అపన్నహస్తం కోసం అర్థించాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్కూరి బసంత్ రెడ్డి నెల రోజుల క్రితం బాధితుడి స్వగ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులను పరమార్శించారు. లక్ష్మణ్ను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
వారం తర్వాత లక్ష్మణ్ను తీసుకురావడానికి దుబాయ్ వెళ్లారు. అక్కడి కొన్ని ట్రస్టుల సహాయంతో తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఎట్టకెలకు లక్ష్మణ్ను స్వదేశానికి తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఉదయం లక్ష్మణ్ను చూసిన బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.