హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన హోర్డింగులపై జీహెచ్ఎంసీ ఎన్ఫోఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేసిన యజమానులకు భారీగా జరిమానాలు విధిస్తోంది. కూకట్పల్లిలోని సుజనా మాల్కు మూడు చలాన్ల ద్వారా మొత్తం 16.5 లక్షల జరిమానా విధించారు. బంజారాహిల్స్లోని జీవీకే మాల్కు 2 లక్షల జరిమానా విధించారు. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం వాణిజ్య భవణాలపై కేవలం 15 శాతం మాత్రమే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో తొలిసారిగా ఎస్బీఐ యోనో డిజిటల్ బ్రాంచ్