ETV Bharat / state

రహదారి సమస్యలకు చెక్‌... బల్దియా సరికొత్త ఆలోచన - comprehencive road maintanence

నగర రోడ్ల నిర్వహణ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ సరికొత్త కార్యక్రమం చేపట్టాలని ఆలోచిస్తోంది. కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనన్స్ పేరుతో నగర ప్రధాన రోడ్ల నిర్వహాణకు కసరత్తు చేపట్టనుంది. రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌లు, రోడ్ల క్లీనింగ్‌, గ్రీనరీని ఏకకాలంలో ఒకే సంస్థ నిర్వహించేలా నిబంధనలు రూపొందిస్తోంది.

రహదారి సమస్యలకు చెక్‌... బల్దియా సరికొత్త ఆలోచన
author img

By

Published : Oct 22, 2019, 5:33 AM IST

హైదరాబాద్‌ రోడ్లు, నాళాల పరిస్థితిపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులతో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. రోడ్ల నిర్వహణలో భాగంగా... గుంతలు పూడ్చడం, నూతన లేయర్‌ రోడ్లు వేయడానికి వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు. ఈ విధానంలో ఏజెన్సీల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు వచ్చేవి. ఇలా కాకుండా నగరంలో ప్రధాన రహదారులను గుర్తించి వాటిని నిర్వహించేందుకు ఐదేళ్ల కాలానికి టెండర్లు పిలవాలని బల్దియా భావిస్తోంది.

ఐదేళ్ల కాలానికి టెండర్లు

టెండర్లు దక్కించుకున్న సంస్థలు బల్దియా ప్రమాణాల మేరకు గుంతలు పూడ్చడం, అవసరమైనప్పుడు కొత్త రోడ్లు వేయడం, గ్రీనరీ, రోడ్ క్లీనింగ్, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలకే అప్పగించాలని యోచిస్తోంది. ఐదేళ్ల పాటు ట్రాన్స్ కో, జల మండలి, ప్రైవేట్ సంస్ధలు భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసిన రోడ్లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులకు శాఖల మధ్య సమన్వయ లోపం ఉండదు. అదే సంస్థపై ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత ఉండనున్నందున... దీర్ఘకాలం మన్నేలా ప్రమాణాలు పాటించే అవకాశం ఉంది. కాంప్రిహెన్సివ్‌ రోడ్‌ మెయింటనెన్స్‌ కార్యక్రమంలో 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజింజి దీర్ఘకాలిక టెండర్లను బల్డియా పిలవనుంది. ఈ కార్యక్రమంతో రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు తొలగిపోతాయని ఇంజినీరింగ్‌ అధికారులు ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నారు.

రహదారి సమస్యలకు చెక్‌... బల్దియా సరికొత్త ఆలోచన

ఇదీ చూడండి: హుజూర్​నగర్​ ఉప పోరులో పెరిగిన ఓటింగ్ శాతం

హైదరాబాద్‌ రోడ్లు, నాళాల పరిస్థితిపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులతో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. రోడ్ల నిర్వహణలో భాగంగా... గుంతలు పూడ్చడం, నూతన లేయర్‌ రోడ్లు వేయడానికి వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు. ఈ విధానంలో ఏజెన్సీల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు వచ్చేవి. ఇలా కాకుండా నగరంలో ప్రధాన రహదారులను గుర్తించి వాటిని నిర్వహించేందుకు ఐదేళ్ల కాలానికి టెండర్లు పిలవాలని బల్దియా భావిస్తోంది.

ఐదేళ్ల కాలానికి టెండర్లు

టెండర్లు దక్కించుకున్న సంస్థలు బల్దియా ప్రమాణాల మేరకు గుంతలు పూడ్చడం, అవసరమైనప్పుడు కొత్త రోడ్లు వేయడం, గ్రీనరీ, రోడ్ క్లీనింగ్, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలకే అప్పగించాలని యోచిస్తోంది. ఐదేళ్ల పాటు ట్రాన్స్ కో, జల మండలి, ప్రైవేట్ సంస్ధలు భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసిన రోడ్లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులకు శాఖల మధ్య సమన్వయ లోపం ఉండదు. అదే సంస్థపై ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత ఉండనున్నందున... దీర్ఘకాలం మన్నేలా ప్రమాణాలు పాటించే అవకాశం ఉంది. కాంప్రిహెన్సివ్‌ రోడ్‌ మెయింటనెన్స్‌ కార్యక్రమంలో 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజింజి దీర్ఘకాలిక టెండర్లను బల్డియా పిలవనుంది. ఈ కార్యక్రమంతో రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు తొలగిపోతాయని ఇంజినీరింగ్‌ అధికారులు ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నారు.

రహదారి సమస్యలకు చెక్‌... బల్దియా సరికొత్త ఆలోచన

ఇదీ చూడండి: హుజూర్​నగర్​ ఉప పోరులో పెరిగిన ఓటింగ్ శాతం

TG_HYD_01_22_Ghmc_New_Plan_On_Roads_Pkg_3182301 Reporter: Kartheek నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ () నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి బల్దియా నూతన కసరత్తు చేపట్టనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ సరికొత్త కార్యక్రమం చేపట్టలాని ఆలోచిస్తోంది. కాంప్రెహెన్సీసివ్ రోడ్ మెయింటెనన్స్ పేరుతో నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహాణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రోడ్ల నిర్వహాణతో పాటు పుట్ పాత్ నిర్మాణాలను వేర్వేరుగా నిర్వహిస్తోంది. అయితే రోడ్లతోపాటు ఫుట్ పాత్ నిర్వహణ, రోడ్ల క్లీనింగ్, గ్రీనరీ నిర్వహాణ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వీటన్నింటిని ఏకకాలంలో నిర్వహించేలా నిబంధనలు రూపొందిస్తోంది. Look వాయిస్ ఓవర్ః జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ రోడ్లు, నాళాల పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశానికి నగర మేయర్ బొంతు రామ్మోహాన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కూమార్, జోనల్ కమీషనర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలో రోడ్ల నిర్వహణలో నూతన పంథాను అవలంభించాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు నగర రోడ్ల నిర్వహాణ కోసం జీహెచ్ఎంసీ ప్రైవేటు కాంట్రాక్టర్లతో... గుంతలు పూడ్చడం, నూతనంగా లేయర్ రోడ్లను వేయడం లాంటి కార్యక్రమాలకు వేర్వేరుగా టెండర్లు పిలుస్తుంది. ఈ విధానంలో వర్కింగ్ ఏజెన్సీల మధ్య సమన్వయ లోపంతో పలు ఇబ్బందులు వస్తున్నాయి. దీంతోపాటు మరమ్మతులకు గురైన రోడ్లను గుర్తించడం.. వాటి నిర్వహాణ అంచనాలు తయారు చేయడం, టెండర్లు పిలవడం వంటి వివిధ ప్రక్రియలకు సమయంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులను గుర్తించి వాటి నిర్వహణ నిమిత్తం ఐదేళ్ల కోసం టెండర్లు పిలవాలని బల్దియా భావిస్తోంది. టెండర్లు దక్కించుకున్న సంస్ధలు బల్దియా నిర్ణయించిన ప్రమాణాల మేరకు రోడ్లను నిర్వహించాల్సి ఉంటుంది. రోడ్డు గుంతలతోపాటు, అవసరమైనప్పుడు కొత్త రోడ్లు వేయడం ఆయా సంస్ధలే చేయాల్సి వస్తుంది. గ్రీనరీ, రోడ్ల క్లీనింగ్, ఫుట్ పాత్ ల నిర్మాణాలు, నిర్వహణ పూర్తి భాద్యత వర్కింగ్ ఏజెన్సీలకే అప్పగించాలని చూస్తోంది. ఐదేళ్ల పాటు ట్రాన్స్ కో, జల మండలి, ప్రైవేట్ సంస్ధలు మాస్టర్ ప్లాన్ విస్తరణ వంటి అవసరాలకు రోడ్లు తవ్వేందుకు వర్కింగ్ ఏజెన్సీలే సహకరిస్తాయి. అయితే ఆయా సంస్ధలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నూతనంగా వేసిన రోడ్లను, పుత్ పాత్ లను వెంటనే తవ్వే అవసరం ఉండదు. దీంతోపాటు ఎప్పుడైన రోడ్లను తవ్వితే వాటినే వెంటనే పూడ్చి, తిరిగి యాథాతధ స్దితికి తేవడంలోనూ ప్రస్తుతం వివిధ శాఖల మధ్య ఉన్న సమన్వయం లోపం, ఆలస్యం ఉండదు. దీంతోపాటు ఐదేళ్ల పాటు అదే సంస్ధపైన నిర్వహాణ భాద్యత ఉండనున్న నేపథ్యంలో పనుల్లో దీర్ఘకాలం మన్నేలా ప్రమాణాలు ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంది. వాయిస్ ఓవర్ః దీనిలో భాగంగా ప్రస్తుతం ఈ కాంప్రహెన్సివ్ రోడ్లు మెంటెనెన్సు కార్యక్రమం కింద 709 కిలోమీటర్ల రోడ్లను ఏడు యూనిట్లుగా విభజించి దీర్ఘకాలిక టెండర్లను బల్దియా పిలవనుంది. ఈ సందర్భంగా ఆయా జోన్లలోని ప్రధాన రోడ్లను గుర్తించి సీఆర్ఎం కార్యక్రమంతో వాటిని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ల నిర్వహణతోపాటు ఇతర అంశాల్లోనూ ఉన్నత ప్రమాణాలను నిర్ధేశించినట్లు, ఆయా వర్కింగ్ ఏజెన్సీలు చేసే పనుల నాణ్యతపైనా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఇంజనీరింగ్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలంగా ప్రధాన రోడ్ల నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లు తొలగిపోతాయాన్న ఆశాభావం వారు వ్యక్తం చేశారు. ఎండ్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.