ETV Bharat / state

GHMC: నేడు జీహెచ్​ఎంసీ తొలి సర్వసభ్య సమావేశం

author img

By

Published : Jun 29, 2021, 5:15 AM IST

2021-22 ఆర్ధికసంవత్సరం వార్షిక పద్దుకు ఆమోదం తెలపడమే ప్రధాన ఆజెండాగా నేడు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ తొలి సర్వసభ్య సమావేశం జరగనుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో సమావేశాన్ని వర్చువల్​గా నిర్వహించనున్నారు.

నేడు జీహెచ్​ఎంసీ తొలి సర్వసభ్య సమావేశం
నేడు జీహెచ్​ఎంసీ తొలి సర్వసభ్య సమావేశం

గ్రేటర్ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకు ఆన్​లైన్ వేధికగా సమావేశం జరుగనుంది. కొవిడ్​ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని వర్చువల్​గా నిర్వహించేందుకు సభ్యులందరికీ ఐడీలను అధికారులు పంపించారు. ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగిస్తారు.

అనంతరం 2021-22 సంవత్సరానికి గాను రూపొందించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తారు. లింగోజిగూడ వార్డుకు జరిగిన ఉపఎన్నికలో గెలుపొందిన రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని మేయర్ విజయలక్ష్మి చేయించనున్నారు. నగరంలో వరదలు ఇతర అంశాలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే అవకాశం ఉంది.

గ్రేటర్ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకు ఆన్​లైన్ వేధికగా సమావేశం జరుగనుంది. కొవిడ్​ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని వర్చువల్​గా నిర్వహించేందుకు సభ్యులందరికీ ఐడీలను అధికారులు పంపించారు. ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగిస్తారు.

అనంతరం 2021-22 సంవత్సరానికి గాను రూపొందించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తారు. లింగోజిగూడ వార్డుకు జరిగిన ఉపఎన్నికలో గెలుపొందిన రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని మేయర్ విజయలక్ష్మి చేయించనున్నారు. నగరంలో వరదలు ఇతర అంశాలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: SCHOOL FEE: స్కూల్​ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.