సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ కవిత బోనాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి నుంచి కవిత బోనమెత్తుకుని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. కవిత బోనం ముందు దారి పోడవునా పోతరాజుల విన్యాసాలు, డప్పు వాద్యాలు ఆకట్టుకున్నాయి. కవితకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'