ETV Bharat / state

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఐచ్ఛికాల ప్రక్రియ వాయిదా

గందరగోళ పరిస్థితుల మధ్య ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఫీజులపై స్పష్టత రాకపోవడం వల్ల ఈ రోజు నుంచి జరగాల్సిన వెబ్​ ఆప్షన్ల నమోదు ప్రక్రియ వాయిదా పడింది. జులై 1 నుంచి జులై 4 వరకు మాత్రమే ఐచ్ఛికాలను ఎంచుకునే అవకాశం కల్పించారు. రుసుముల పెంపునకు హైకోర్టు నుంచి అనుమతి పొందిన కళాశాలలపై నేడో, రేపో ధర్మాసనం వద్ద అప్పీల్ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.

author img

By

Published : Jun 27, 2019, 5:09 AM IST

Updated : Jun 27, 2019, 7:25 AM IST

విద్యార్థులు
నేటి నుంచే ఎంసెట్​ ధ్రువపత్రాల పరిశీలన

ఫీజులపై నెలకొన్న గందరగోళంతో ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు. ఇవాళ మొదలు కావల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జులై 1కి వాయిదా వేశారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు నాలుగు రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలన ఈరోజు నుంచే జరగనుంది. విద్యార్థులు ముందుగా బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారమే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 24న మొదలైన స్లాట్ బుకింగ్ ప్రక్రియ జులై 1 వరకు కొనసాగనుంది. నేటి నుంచి జులై 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 1 నుంచి జులై 4 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జులై 6న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయక కేంద్రాలను సిద్ధం చేశారు. నిన్నటి వరకు 45 వేల 156 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పరిశీలించనున్నారు. సహాయక కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు. ఆధార్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.

రుసుములపై తేలని లెక్క

మరోవైపు ఇంజినీరింగ్ రుసుములపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఛైర్మన్ నియామకం జరగక పోవడం వల్ల.. ఇంతవరకు ఫీజులు ఖరారు కాలేదు. రుసుములు ఖరారు చేయకుండా కౌన్సెలింగ్​కు ఏర్పాట్లు చేయడం వల్ల కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. ఏఎఫ్ఆర్​సీ ఛైర్మన్ కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులు వసూలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతినిచ్చింది.

జులై 1కి వాయిదా

న్యాయస్థానం తీర్పు ప్రతి ఆలస్యంగా అందడం వల్ల నేడు లేదా రేపు ధర్మాసనం ఎదుట సవాల్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఫీజు ఎంతో తెలిస్తేనే విద్యార్థులు కాలేజీని ఎంచుకోవడానికి వీలుంటుంది. అందుకే వెబ్ ఆప్షన్ల నమోదును జులై 1కి వాయిదా వేశారు.

ఇవీ చూడండి: అనారోగ్యంతో అలనాటి నటి విజయనిర్మల మృతి

నేటి నుంచే ఎంసెట్​ ధ్రువపత్రాల పరిశీలన

ఫీజులపై నెలకొన్న గందరగోళంతో ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు. ఇవాళ మొదలు కావల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జులై 1కి వాయిదా వేశారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు నాలుగు రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలన ఈరోజు నుంచే జరగనుంది. విద్యార్థులు ముందుగా బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారమే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 24న మొదలైన స్లాట్ బుకింగ్ ప్రక్రియ జులై 1 వరకు కొనసాగనుంది. నేటి నుంచి జులై 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 1 నుంచి జులై 4 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జులై 6న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయక కేంద్రాలను సిద్ధం చేశారు. నిన్నటి వరకు 45 వేల 156 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పరిశీలించనున్నారు. సహాయక కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు. ఆధార్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.

రుసుములపై తేలని లెక్క

మరోవైపు ఇంజినీరింగ్ రుసుములపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఛైర్మన్ నియామకం జరగక పోవడం వల్ల.. ఇంతవరకు ఫీజులు ఖరారు కాలేదు. రుసుములు ఖరారు చేయకుండా కౌన్సెలింగ్​కు ఏర్పాట్లు చేయడం వల్ల కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. ఏఎఫ్ఆర్​సీ ఛైర్మన్ కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులు వసూలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతినిచ్చింది.

జులై 1కి వాయిదా

న్యాయస్థానం తీర్పు ప్రతి ఆలస్యంగా అందడం వల్ల నేడు లేదా రేపు ధర్మాసనం ఎదుట సవాల్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఫీజు ఎంతో తెలిస్తేనే విద్యార్థులు కాలేజీని ఎంచుకోవడానికి వీలుంటుంది. అందుకే వెబ్ ఆప్షన్ల నమోదును జులై 1కి వాయిదా వేశారు.

ఇవీ చూడండి: అనారోగ్యంతో అలనాటి నటి విజయనిర్మల మృతి

సికింద్రాబాద్ యాంకర్ ..ఇంట్లో ఎవరు లేని సమయంలో నాగలక్ష్మి అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..2009లో తన కూతురుకు వివాహం అయినట్లు ప్రస్తుతం వారు తిరుమలగిరిలో నివాసం ఉంటున్నట్లు తన కూతురి మరణంపై అనుమానాలు ఉన్నట్లు నాగలక్ష్మి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు..ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు..నాగలక్ష్మి భర్త ఆమె తండ్రి గత కొన్ని రోజులుగా ఒకే దగ్గర పనిచేసేవారని అన్నారు..నాగలక్ష్మి భర్త వెంకటేష్ కొన్ని రోజుల క్రితం మిల్లర్ మిషన్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు ..అందులో వీరికి నష్టం వచ్చినట్లు దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారని అన్నారు ..పిల్లల ఫీజులు కట్టలేక ఆర్థికంగా సతమతమయ్యారని తెలిపారు..రోజువారి పని నిమిత్తం నాగలక్ష్మి భర్త వెంకటేష్ ఆమె తండ్రి బయటకు వెళ్లారని తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయన్నారు ..తలుపులు ఎంత కొట్టినా కూడా తిరగకపోవడంతో తన భర్త కిటికీలోనుంచి చూసేసరికి ఆమె ఊరికి వేలాడుతూ కనిపించడం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది..వెంటనే చుట్టుపక్కన వాళ్లంతా కలిసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు..నాగలక్ష్మి మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి ..పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..
Last Updated : Jun 27, 2019, 7:25 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.