ETV Bharat / state

ఆగిన గుండెకు ఆయువిచ్చారు! - rajmahendravaram news

పాముకాటుకు గురై ఆ పసిగుండె ఆగిపోయింది. అందరూ ఆశలు వదిలేసుకున్నారు. అయితే పొయిన ప్రాణాన్ని తిరిగి నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు. హృదయ స్పందన నిలిచిపోయినా.. వెంటిలేటర్​పై ఉంచి ప్రాణాలు కాపాడారు.

doctors-survived-a-boy-who-was-bitten-by-a-snake
ఆగిన గుండెకు ఆయువిచ్చారు!
author img

By

Published : May 10, 2020, 11:56 AM IST

పాము కాటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడికి ఏపీలోని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు. కోరుకొండ గ్రామానికి చెందిన బొక్కా సిద్ధు పదో తరగతి చదువుతున్నాడు. 4న ఇంటి వద్ద పాము కాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకోవడం వల్ల రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వెంటిలేటర్‌పై చికిత్స అందించగా శనివారం స్పృహలోకి వచ్చాడు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయానికి.. విష ప్రభావంతో కొంతసేపు హృదయ స్పందన నిలిచిపోయిందని, సకాలంలో వైద్యం అందించడంతో బతికినట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు లక్షలో ఒకటి ఉంటాయని ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డా.చంద్రశేఖర్‌ తెలిపారు.

పాము కాటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడికి ఏపీలోని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు. కోరుకొండ గ్రామానికి చెందిన బొక్కా సిద్ధు పదో తరగతి చదువుతున్నాడు. 4న ఇంటి వద్ద పాము కాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకోవడం వల్ల రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వెంటిలేటర్‌పై చికిత్స అందించగా శనివారం స్పృహలోకి వచ్చాడు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయానికి.. విష ప్రభావంతో కొంతసేపు హృదయ స్పందన నిలిచిపోయిందని, సకాలంలో వైద్యం అందించడంతో బతికినట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు లక్షలో ఒకటి ఉంటాయని ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డా.చంద్రశేఖర్‌ తెలిపారు.

ఇదీచూడండి: ప్రతి అమ్మా... వరల్డ్ ఫేమస్ లవరే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.