ETV Bharat / state

లాక్​డౌన్​కు ప్రజలు సహకరిస్తున్నారు: డీజీపీ

author img

By

Published : May 25, 2021, 9:49 PM IST

లాక్​డౌన్​కు ప్రజలు సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పాతబస్తీలో లాక్‌డౌన్‌ అమలును ఆయన పరిశీలించారు.

పాతబస్తీలో లాక్​డౌన్​ అమలును పరిశీలించిన డీజీపీ
పాతబస్తీలో లాక్​డౌన్​ అమలును పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్​ పాతబస్తీలో డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటించారు. కరోనా కట్టడిలో భాగంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌ తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని.. వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం షాలిబండ, ఐఎస్‌ సదన్‌, సంతోశ్​నగర్‌ తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను డీజీపీ పరిశీలించారు. నగర సీపీ అంజనీకుమార్, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ డీజీపీ వెంట ఉన్నారు.

హైదరాబాద్​ పాతబస్తీలో డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటించారు. కరోనా కట్టడిలో భాగంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌ తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని.. వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం షాలిబండ, ఐఎస్‌ సదన్‌, సంతోశ్​నగర్‌ తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను డీజీపీ పరిశీలించారు. నగర సీపీ అంజనీకుమార్, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ డీజీపీ వెంట ఉన్నారు.

ఇదీ చూడండి: రెండో డోసు కోసం టీకా కేంద్రాలకు పోటెత్తిన లబ్ధిదారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.