హైదరాబాద్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా విశేష ఖ్యాతిని సంతరించుకునే ఖైరతాబాద్ గణపతి సందర్శనకు రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. అధిక సంఖ్యలో ప్రజలు ద్వాదశాదిత్య మహా గణపతిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు ప్రముఖులు రాక, మరో వైపు భక్తుల సందడితో ఖైరతాబాద్ ప్రాంతమంతా సందడిగా మారింది.
ఇదీ చూడండి : '2020 మార్చి నాటికి 300 విద్యుత్ బస్సులు'