ETV Bharat / state

CS: గోదాముల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలి: సీఎస్‌ - గోదాముల నిర్మాణాలపై సీఎస్​ సమావేశం

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గోదాముల నిర్మాణాల కోసం కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అధికారులకు సూచించారు. ఈ మేరకు సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

CS Somesh Kumar review
రాష్ట్రంలో గోదాముల నిర్మాణాలపై సీఎస్ సమీక్ష
author img

By

Published : Jun 15, 2021, 8:30 PM IST

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గోదాముల నిర్మాణాలకు చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు గోదాముల నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్‌ బీఆర్​కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం, ఈ ఏడాది వానకాలంలో రాబోయే ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తుల డిమాండ్, దిగుబడులు తదితర అంశాలపై చర్చించారు. గిడ్డంగుల నిర్మాణాలకు సంబంధించి భూమి సేకరణ, ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎస్​ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎండీ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దినసరి కూలీలకు గుడ్​న్యూస్

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గోదాముల నిర్మాణాలకు చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు గోదాముల నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్‌ బీఆర్​కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం, ఈ ఏడాది వానకాలంలో రాబోయే ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తుల డిమాండ్, దిగుబడులు తదితర అంశాలపై చర్చించారు. గిడ్డంగుల నిర్మాణాలకు సంబంధించి భూమి సేకరణ, ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎస్​ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎండీ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దినసరి కూలీలకు గుడ్​న్యూస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.