ETV Bharat / state

'విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి... కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి'

author img

By

Published : Jun 23, 2020, 5:57 PM IST

లాక్​డౌన్​ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ  (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్​రోడ్డులో నిరసన చేపట్టింది. ఓ వైపు ప్రజలు ఉపాధి లేక బాధపడుతుంటే.. ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPIML Protest On Petrol, Diesel Price Hike
పెట్రోల్​ ధరలు తగ్గించాలని న్యూడెమోక్రసీ నేతల నిరసన

పెంచిన పెట్రోల్​, డీజిల్​, విద్యుత్​ ధరలు తగ్గించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఆర్టీసీ క్రాస్​రోడ్డులో ఆందోళన నిర్వహించారు. ఓ వైపు ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్​ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు.

పది రోజుల్లోనే పెట్రోల్​, డీజిల్​ ధరలు పది రూపాయలకు పైగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో సతమతవుతున్న ప్రజలకు రవాణా సైకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్​ ఆయిల్​ ధరలు తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం 300 యూనిట్ల వరకు విద్యుత్​ ఉచితంగా అందించాలని, విద్యుత్​ ఛార్జీలు రద్దు చేయాలని డీమాండ్​ చేశారు.

పెంచిన పెట్రోల్​, డీజిల్​, విద్యుత్​ ధరలు తగ్గించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఆర్టీసీ క్రాస్​రోడ్డులో ఆందోళన నిర్వహించారు. ఓ వైపు ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్​ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు.

పది రోజుల్లోనే పెట్రోల్​, డీజిల్​ ధరలు పది రూపాయలకు పైగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో సతమతవుతున్న ప్రజలకు రవాణా సైకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్​ ఆయిల్​ ధరలు తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం 300 యూనిట్ల వరకు విద్యుత్​ ఉచితంగా అందించాలని, విద్యుత్​ ఛార్జీలు రద్దు చేయాలని డీమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.