ETV Bharat / state

Viveka Murder Case: 'వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌.. మేమూ నీతో పాటు వస్తాం'

వివేకా హత్య కేసులో (Viveka Murder Case) నిందితుడు దస్తగిరి తరఫున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్​పై (CBI Approver Petition) న్యాయవాదులు బుధవారం కడప సబ్ కోర్టులో (Kadapa Sub Court) కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. దస్తగిరి వాంగ్మూలంపై హత్య కేసు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్యకు ప్రణాళిక రచించింది ఎర్ర గంగిరెడ్డేనని దస్తగిరి వాంగ్మూలంలో తేల్చి చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించనున్నారు.

author img

By

Published : Nov 17, 2021, 9:45 AM IST

Viveka Murder Case
వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (Viveka Murder Case) నిందితుడుగా (ఏ-4) ఉన్న ఆయన మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి తరపున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్​పై (CBI Approver Petition) న్యాయవాదులు బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. గత నెల 22న సీఆర్పీసీ సెక్షన్ 306 ప్రకారం వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో దస్తగిరి అప్రూవర్​గా మారుతున్నాడని..అతని వాంగ్మూలం నమోదు చేయాలని కడప సబ్​ కోర్టులో (Kadapa Sub Court) సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మరో ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలకు సీబీఐ నోటీసులు కూడా పంపింది.

ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు ఇటీవల సీబీఐ (CBI) వేసిన అప్రూవర్ పిటిషన్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పత్రాలు ఇవ్వాలని న్యాయవాదుల కోరడంతో.. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈనెల 13న ఆ పత్రాలను ముగ్గురు న్యాయవాదులకు అందజేసింది. దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హత్య (Viveka Murder Case)కు ప్రణాళిక రచించింది ఎర్ర గంగిరెడ్డేనని దస్తగిరి వాంగ్మూలంలో తేల్చి చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు బుధవారం కడప సబ్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించనున్నారు.

ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్

మరోవైపు వివేకా హత్య కేసు (Viveka Murder Case) ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై న్యాయస్థానం విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో అరెస్టై.. ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.

వెలుగులోకి సంచలన విషయాలు..

'వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను' అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు. ఆ సమయంలో యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు కూడా ఉన్నారని తెలిపారు. అలా 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య (Viveka Murder Case) కుట్ర రూపొందిందని చెప్పారు. 'డ్రైవర్‌గా ఏం సంపాదిస్తావ్‌ ? ఈ హత్య చెయ్యి. నీ జీవితం సెటిలైపోద్ది' అంటూ గంగిరెడ్డి తనతో చెప్పాడన్నారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్‌ తనకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడని చెప్పారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164 (1) ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, సీబీఐకి ఆగస్టు 25న ఇచ్చిన వాంగ్మూలాలు ఈనెల 13న వెలుగులోకి వచ్చాయి.

ఇదీ చదవండి: YS Viveka: తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన విజయశంకర్ రెడ్డి

YS Viveka murder case: పులివెందులలో వివేకా ఇంటికి మరోసారి సీబీఐ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (Viveka Murder Case) నిందితుడుగా (ఏ-4) ఉన్న ఆయన మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి తరపున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్​పై (CBI Approver Petition) న్యాయవాదులు బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. గత నెల 22న సీఆర్పీసీ సెక్షన్ 306 ప్రకారం వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో దస్తగిరి అప్రూవర్​గా మారుతున్నాడని..అతని వాంగ్మూలం నమోదు చేయాలని కడప సబ్​ కోర్టులో (Kadapa Sub Court) సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మరో ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలకు సీబీఐ నోటీసులు కూడా పంపింది.

ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు ఇటీవల సీబీఐ (CBI) వేసిన అప్రూవర్ పిటిషన్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పత్రాలు ఇవ్వాలని న్యాయవాదుల కోరడంతో.. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈనెల 13న ఆ పత్రాలను ముగ్గురు న్యాయవాదులకు అందజేసింది. దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హత్య (Viveka Murder Case)కు ప్రణాళిక రచించింది ఎర్ర గంగిరెడ్డేనని దస్తగిరి వాంగ్మూలంలో తేల్చి చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు బుధవారం కడప సబ్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించనున్నారు.

ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్

మరోవైపు వివేకా హత్య కేసు (Viveka Murder Case) ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై న్యాయస్థానం విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో అరెస్టై.. ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.

వెలుగులోకి సంచలన విషయాలు..

'వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను' అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు. ఆ సమయంలో యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు కూడా ఉన్నారని తెలిపారు. అలా 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య (Viveka Murder Case) కుట్ర రూపొందిందని చెప్పారు. 'డ్రైవర్‌గా ఏం సంపాదిస్తావ్‌ ? ఈ హత్య చెయ్యి. నీ జీవితం సెటిలైపోద్ది' అంటూ గంగిరెడ్డి తనతో చెప్పాడన్నారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్‌ తనకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడని చెప్పారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164 (1) ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, సీబీఐకి ఆగస్టు 25న ఇచ్చిన వాంగ్మూలాలు ఈనెల 13న వెలుగులోకి వచ్చాయి.

ఇదీ చదవండి: YS Viveka: తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన విజయశంకర్ రెడ్డి

YS Viveka murder case: పులివెందులలో వివేకా ఇంటికి మరోసారి సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.