ETV Bharat / state

Congress MLA Ticket Applications : కాంగ్రెస్‌ రేసుగుర్రాల ఎంపిక.. తొలిరోజు 18 దరఖాస్తులు

author img

By

Published : Aug 19, 2023, 9:14 AM IST

Congress MLA Ticket Applications : అసెంబ్లీ సమరానికి కాంగ్రెస్‌లో రేసుగుర్రాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. టికెట్ల కేటాయింపులో పారదర్శకతకు పెద్దపీటవేస్తూ.. ప్రజాదరణ ఉండి, ప్రత్యర్థులను ఎదుర్కోగలిగే వారికే ప్రాధాన్యతనిస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణలో శుక్రవారం 18మంది ఆశావహులు అర్జీలు ఇవ్వగా.. ఈరోజు నుంచి పెరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ల విషయంలో ఇప్పటి వరకు ఎవరికి హామీ ఇవ్వలేదని వెల్లడించిన పీసీసీ అధ్యక్షుడు.. తమకే టికెట్‌ అంటూ ఎవరైనా ప్రచారం చేసుకున్నా.. అదంతా అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.

Congress Telangana Elections 2023
Telangana Assembly Elections 2023
Congress Party Application Process For Assembly Election Telangana తమకే టికెట్‌ అంటూ ఎవరైనా ప్రచారం చేసుకున్నా అదంతా అపోహ మాత్రమే : రేవంత్​రెడ్డి

Congress MLA Ticket Applications Telangana : శాసనసభ ఎన్నికలకు సమయాత్తమవుతున్న కాంగ్రెస్.. కీలక ఘట్టమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతకు పట్టంకట్టాలన్న ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు తమకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకున్నదంతా అపోహేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖరాఖండిగా చెప్పారు.

Telangana Congress MLA Ticket Applications 2023 : పార్టీ విధివిధానాలు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుందని వెల్లడించారు. సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka)తో కలిసి గాంధీభవన్‌లో దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్‌రెడ్డి ఎంపిక విధానాన్ని తెలియజేశారు. పార్టీ నిర్ణయించిన మేరకు తనతో సహా ఆశావహులంతా రుసుం చెల్లించి టికెట్‌ కోసం అర్జీ చేసుకోవాలని తేల్చి చెప్పారు. ఎస్సీ,ఎస్టీలకు రూ.25వేలు ఇతరులకు రూ.50వేలు ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ , స్క్రీనింగ్ కమిటీ , పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంతవరకు వడపోత కార్యక్రమం ఉంటుందన్నారు.

"ఈ నెల 25 తరవాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అర్జీలను సరిచూసి, నియోజకవర్గాలవారీగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ నమోదు చేస్తారు. ఇదివరకే జరుగుతున్న సర్వేలకు అనుగుణంగా, వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ మొత్తం స్టేట్ స్ర్కీనింగ్ కమిటీగా నియమించిన ముఖ్య కమిటీకి మేము సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఊహాగానాలకు తోవలేకుండా పార్టీ అంతర్గత సమావేశాలలో పారదర్శకతగా చర్చించి గెలుపు ప్రాతిపదికిన అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Telangana Assembly Elections 2023 : ఈ నెల 25 వరకు వచ్చే దరఖాస్తులను క్రోడీకరించి.. అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్వేల ఆధారంగా తొలుత నియోజకవర్గానికి ముగ్గురితో కూడిన జాబితాను రూపొందించి, స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అక్కడ వడపోత అనంతరం... సీఈసీ(Central Election Committee Congress)కి పంపుతారని.. అక్కడే అభ్యర్థుల ఎంపిక తేలుతుందని చెప్పారు. నిన్న మధ్యాహ్నం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. తొలిరోజు 18 మంది ఆశావహులు అర్జీలిచ్చారు. ఇవాళ్టి నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

సభలు, సమావేశాలుపై సమాలోచనలు.. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రజల్లోకి వెళ్లే అంశంపై కాంగ్రెస్‌ నాయకత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు పీసీసీ(ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) కార్యవర్గం ఇవాళ అత్యవసరంగా భేటీ కానుంది. గద్వాల్‌ సభతో పాటు కాంగ్రెస్‌ చేపట్టిన "తిరగబడదాం - తరిమికొడదాం" అనే కార్యక్రమంపై చర్చించే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge) హాజరుకానున్న చేవెళ్ల సభపైనా సమాలోచనలు జరపనున్నారు.

Revanth Reddy Allegations on Liquorshop Licence : 'మద్యం దుకాణాలకు ముందే ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు..?'

Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'

Congress Party Application Process For Assembly Election Telangana తమకే టికెట్‌ అంటూ ఎవరైనా ప్రచారం చేసుకున్నా అదంతా అపోహ మాత్రమే : రేవంత్​రెడ్డి

Congress MLA Ticket Applications Telangana : శాసనసభ ఎన్నికలకు సమయాత్తమవుతున్న కాంగ్రెస్.. కీలక ఘట్టమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతకు పట్టంకట్టాలన్న ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు తమకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకున్నదంతా అపోహేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖరాఖండిగా చెప్పారు.

Telangana Congress MLA Ticket Applications 2023 : పార్టీ విధివిధానాలు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుందని వెల్లడించారు. సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka)తో కలిసి గాంధీభవన్‌లో దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్‌రెడ్డి ఎంపిక విధానాన్ని తెలియజేశారు. పార్టీ నిర్ణయించిన మేరకు తనతో సహా ఆశావహులంతా రుసుం చెల్లించి టికెట్‌ కోసం అర్జీ చేసుకోవాలని తేల్చి చెప్పారు. ఎస్సీ,ఎస్టీలకు రూ.25వేలు ఇతరులకు రూ.50వేలు ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ , స్క్రీనింగ్ కమిటీ , పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంతవరకు వడపోత కార్యక్రమం ఉంటుందన్నారు.

"ఈ నెల 25 తరవాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అర్జీలను సరిచూసి, నియోజకవర్గాలవారీగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ నమోదు చేస్తారు. ఇదివరకే జరుగుతున్న సర్వేలకు అనుగుణంగా, వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ మొత్తం స్టేట్ స్ర్కీనింగ్ కమిటీగా నియమించిన ముఖ్య కమిటీకి మేము సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఊహాగానాలకు తోవలేకుండా పార్టీ అంతర్గత సమావేశాలలో పారదర్శకతగా చర్చించి గెలుపు ప్రాతిపదికిన అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Telangana Assembly Elections 2023 : ఈ నెల 25 వరకు వచ్చే దరఖాస్తులను క్రోడీకరించి.. అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్వేల ఆధారంగా తొలుత నియోజకవర్గానికి ముగ్గురితో కూడిన జాబితాను రూపొందించి, స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అక్కడ వడపోత అనంతరం... సీఈసీ(Central Election Committee Congress)కి పంపుతారని.. అక్కడే అభ్యర్థుల ఎంపిక తేలుతుందని చెప్పారు. నిన్న మధ్యాహ్నం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. తొలిరోజు 18 మంది ఆశావహులు అర్జీలిచ్చారు. ఇవాళ్టి నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

సభలు, సమావేశాలుపై సమాలోచనలు.. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రజల్లోకి వెళ్లే అంశంపై కాంగ్రెస్‌ నాయకత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు పీసీసీ(ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) కార్యవర్గం ఇవాళ అత్యవసరంగా భేటీ కానుంది. గద్వాల్‌ సభతో పాటు కాంగ్రెస్‌ చేపట్టిన "తిరగబడదాం - తరిమికొడదాం" అనే కార్యక్రమంపై చర్చించే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge) హాజరుకానున్న చేవెళ్ల సభపైనా సమాలోచనలు జరపనున్నారు.

Revanth Reddy Allegations on Liquorshop Licence : 'మద్యం దుకాణాలకు ముందే ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు..?'

Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.