ఉత్తర్ప్రదేశ్లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన, రాహుల్గాంధీ పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేడ్క్ర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, మర్రి శశిధర్ రెడ్డి, నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రదర్శన చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి, భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.